News October 10, 2025

గాంధారి: చెరువులో పడి మహిళ మృతి

image

గాంధారి మండలం పెద్ద పొతంగల్‌కు చెందిన దుర్కి సాయవ్వ(40) గిద్దల చెరువులో పడి మృతి చెందింది. గ్రామస్థుల కథనం ప్రకారం.. గ్రామంలో ఆమె ఒంటరిగా జీవిస్తోంది. గురువారం ఉదయం కాలకృత్యాలు వెళ్లి కాలుజారి చెరువులో పడి మృతి చెందింది. దీంతో స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆమె కూతురు సౌందర్య ఫిర్యాదు మేరకు ఎస్సై ఆంజనేయులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Similar News

News October 10, 2025

ఏ ఒక్క పత్తి రైతూ నష్టపోకుండా చూడాలి: VZM జేసీ

image

ఏ ఒక్క పత్తి రైతు నష్టపోకుండా చూడాలని అధికారుల‌ను జాయింట్ క‌లెక్ట‌ర్ ఎస్‌.సేధు మాద‌వ‌న్ ఆదేశించారు. పత్తి కొనుగోళ్లపై జిల్లాస్థాయి కమిటీ సమావేశం జేసీ ఛాంబర్‌లో శుక్రవారం జరిగింది. పత్తి రైతు ఈ-క్రాప్ కచ్చితంగా నమోదు చేయాలని సూచించారు. ప్రభుత్వం ప‌త్తికి మద్దతు ధర క్వింటా రూ. 8,110గా నిర్ణ‌యించింద‌ని, ఈ విష‌యాన్ని RSKల ద్వారా విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు.

News October 10, 2025

గద్వాల్: సమాచార హక్కు చట్టంపై అవగాహన ఉండాలి

image

సమాచార హక్కు చట్టం ప్రభుత్వ అధికారుల పనితీరులో పారదర్శకత, జవాబుదారీతనాన్ని పెంపొందించే లక్ష్యంతో రూపొందించడం జరిగిందని, ఈ చట్టంపై ప్రతి ఒక్కరికి అవగాహన అవసరమని కలెక్టర్ సంతోష్ అన్నారు. ఈనెల 5 నుంచి 12 వరకు ఆర్టీఐ అవగాహన వారోత్సవాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో శుక్రవారం గద్వాల ఐడిఓసి సమావేశపు మందిరంలో జిల్లా అధికారులకు చట్టంపై అవగాహన సమావేశం నిర్వహించి కలెక్టర్ మాట్లాడారు.

News October 10, 2025

VZM: ‘సూపర్ జీఎస్టీతో అన్నివ‌ర్గాల‌కు ప్ర‌యోజ‌న‌క‌రం’

image

అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల‌కు ప్ర‌యోజ‌నం క‌ల్గించే విధంగా జీఎస్టీ శ్లాబుల‌ను ప్ర‌భుత్వం స‌వ‌రించింద‌ని క‌లెక్ట‌ర్ ఎస్‌.రాంసుంద‌ర్ రెడ్డి చెప్పారు. దీనిని ప్ర‌జ‌లంతా స‌ద్వినియోగం చేసుకోవాల‌ని ఆయ‌న పిలుపునిచ్చారు. స్థానిక మ‌హారాజా ప్ర‌భుత్వ సంగీత‌, నృత్య క‌ళాశాల‌లో వాణిజ్య ప‌న్నుల‌శాఖ‌, ఛాంబ‌ర్ ఆఫ్ కామ‌ర్స్ ఏర్పాటు చేసిన 2 రోజుల‌ ప్ర‌ద‌ర్శ‌న, విక్రయాల‌ను శుక్ర‌వారం ప్రారంభించారు.