News March 29, 2025

గాంధారి: వడ్డీ వ్యాపారులపై కేసు

image

గాంధారి మండలం తిప్పారం గ్రామానికి చెందిన పలువురు వ్యక్తులు అక్రమంగా వడ్డీ వ్యాపారం నిర్వహిస్తున్నారని సమాచారం మేరకు శుక్రవారం ఎస్ఐ ఆంజనేయులు ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు. గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులు ఎలాంటి అనుమతులు లేకుండా వడ్డీ వ్యాపారం చేస్తున్నారని వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ ఆంజనేయులు తెలిపారు.

Similar News

News March 31, 2025

వనపర్తి జిల్లాలో 24 గంటల్లో నమోదైన ఉష్ణోగ్రత వివరాలు ఇలా..

image

వనపర్తి జిల్లాలో 20 ఉష్ణోగ్రత నమోదు కేంద్రాల్లో గడిచిన 24 గంటల్లో నమోదైన ఉష్ణోగ్రత వివరాలు ఇలా.. అత్యధికంగా దగడ, వెలుగొండలో 40.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. పెబ్బేరు 40.4, రేమోద్దుల 40.3, ఆత్మకూరు 40.1, పానగల్ 39.7, శ్రీరంగాపూర్ 39.7, కానాయిపల్లి 39.6, జానంపేట 39.6, విలియంకొండ 39.5, వీపనగండ్ల 39.5, సోలిపూర్ 39.1, గోపాల్‌పేట 39.1, అమరచింత 39.1, మదనాపూర్ 38.9 డిగ్రీలుగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

News March 31, 2025

నీటి నాణ్యత ప్రమాణాల పరీక్షలను చేపట్టాలి: కలెక్టర్

image

పార్వతీపురం జిల్లాలో నీటి నాణ్యత ప్రమాణాల పరీక్షలను ఎప్పటికప్పుడు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఏ శ్యామ్ ప్రసాద్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు సోమవారం సంబంధిత అధికారులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆరోగ్య శాఖ, ఆర్డబ్ల్యూఎస్ శాఖల పరిధిలో చేపడుతున్న నీటి నాణ్యత పరీక్షలు పక్కాగా ఉండాలని ఆయన స్పష్టం చేశారు. రెండు శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆయన ఆదేశించారు.

News March 31, 2025

రేపటి నుంచి మరో ఉచిత సిలిండర్: నాదెండ్ల

image

AP: దీపం-2 పథకం కింద ఇప్పటి వరకు 99 లక్షల మందికి ఉచిత గ్యాస్ సిలిండర్ అందించామని మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. లబ్ధిదారులకు ఏప్రిల్ 1 నుంచి జులై 31 మధ్య మరో సిలిండర్ ఇస్తామని చెప్పారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రజలకు సూచించారు. విశాఖలో మాట్లాడుతూ ఉత్తరాంధ్ర యువతకు ఉపాధి కల్పించాలని పవన్ కళ్యాణ్ తపన పడుతున్నారని చెప్పారు. త్వరలోనే భారీ పెట్టుబడులు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు.

error: Content is protected !!