News July 22, 2024

గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ రాజారావు బదిలీ

image

గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఎం.రాజారావు బదిలీ అయ్యారు. యాదాద్రి భువనగిరి ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్‌గా రేపు ఆయన ఛార్జ్ తీసుకోనున్నారు. కొవిడ్ పాండమిక్‌లో వేలాది మంది పేషెంట్ల ప్రాణాలను తన మెడికల్ టీంతో కలిసి కాపాడిన ఆయన సేవ భావానికి అప్పట్లో దేశవ్యాప్తంగా ప్రశంసలు లభించాయి. ఈరోజు తన బాధ్యతల నుంచి రిలీవ్ అయిన రాజారావును ఆసుపత్రి సిబ్బంది ఘనంగా సన్మానించి, వీడ్కోలు చెప్పారు.

Similar News

News September 8, 2025

రూ.298 కోట్లతో కోకాపేట లేఅవుట్ డెవలప్‌మెంట్

image

గోదావరి డ్రింకింగ్ వాటర్ స్కీమ్‌ ఫేజ్ 2, 3, ORR డ్రింకింగ్ వాటర్ సప్లై ప్రాజెక్ట్ ఫేజ్ 2తో పాటు కోకాపేట లేఅవుట్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టుకు నేడు CM రేవంత్ శంకుస్థాపన చేయనున్నారు. రూ.298 కోట్లతో కోకాపేట లే అవుట్, నియోపొలిస్, స్పెషల్ ఎకనామిక్ జోన్(SEZ)లో‌ తాగునీరు, నూతన మురుగునీటి వ్యవస్థ‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ కీలక ప్రాజెక్టులను 2 ఏళ్లలో పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకొంది.

News September 8, 2025

ORR డ్రింకింగ్ వాటర్ సప్లై ప్రాజెక్ట్ ఫేజ్-2కు శ్రీకారం

image

గోదావరి డ్రింకింగ్ వాటర్ స్కీమ్‌ ఫేజ్ 2, 3‌తో రూ.1,200 కోట్లతో ORR డ్రింకింగ్ వాటర్ సప్లై ప్రాజెక్ట్ ఫేజ్-2ను CM రేవంత్‌ ప్రారంభిస్తారు. GHMC, సిటీ శివారు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, ORR పరిధి GPలకు నీటి సరఫరా అందించాలనేది దీని లక్ష్యం. ఈ ప్రాజెక్టులో భాగంగా 71 రిజర్వాయర్లు నిర్మించగా.. ఇందులో కొత్తగా నిర్మించిన 15 రిజర్వాయర్లను CM ప్రారంభించనున్నారు.

News September 8, 2025

ORR: తాగునీరు అందే ప్రాంతాలు ఇవే

image

ORR డ్రింకింగ్ వాటర్ సప్లై ప్రాజెక్ట్ ఫేజ్ 2తో సిటీ శివారు ప్రాంతాల్లో ప్రజల కష్టాలు తీరనున్నాయి. దాదాపు 14 మండలాల్లోని 25 లక్షల మంది ప్రజలకు మేలు జరగనుందని అధికారులు తెలిపారు. ఈ ప్రాజెక్ట్‌ ద్వారా సరూర్‌నగర్, మహేశ్వరం, శంషాబాద్, హయత్‌నగర్, ఇబ్రహీంపట్నం, ఘట్‌కేసర్, కీసర, రాజేంద్రనగర్, శామీర్‌పేట, మేడ్చల్, కుత్బుల్లాపూర్, RCపురం, పటాన్‌చెరు, బొల్లారం ప్రాంత వాసులకు మంచినీరు అందించనున్నారు.