News September 28, 2024
గాజువాక: హెల్మెట్ ఉన్నా.. భార్య, కూతురికి తప్పని శోకం
గాజువాక పోలీస్ స్టేషన్ పరిధిలో షీలా నగర్ రహదారిపై శుక్రవారం డాక్ యార్డ్ ఉద్యోగి దిలీప్ కుమార్(33) మృతిచెందిన విషయం తెలిసిందే. అల్లూరి జిల్లా హుకుంపేటకు చెందిన ఇతను పెందుర్తి మం. సరిపల్లిలో ఉంటున్నారు. విధులు ముగించుకొని బైకుపై వెళ్తుండగా టోల్ గేట్ సమీపంలో లారీ ఢీకొనగా, దిలీప్ అక్కడికక్కడే మృతి చెందారు. మృతుడికి భార్య, కుమార్తె ఉన్నారు. హెల్మెట్ ఉన్నా ప్రాణాలు దక్కలేదని కుటుంబ సభ్యులు రోదించారు.
Similar News
News October 10, 2024
బంతి పూల సొగసులతో..అరకు మరింత సోయగం
అరకులో జైపూర్ జంక్షన్ దగ్గర బోడ అనే రైతు బంతిపూల సాగుతూ ఒక సీజన్లో అత్యధిక రాబడిని పొందుతున్నాడు. టూరిస్టులు ఈ ప్రదేశంలో వచ్చి ఫోటోలు తీసుకోవడం వలన ఆ రైతుకు వచ్చే డబ్బు ఆధారంగా ఆదాయాన్ని పొందుతున్నాడు. ఆ పూల తోటలో ఫోటోలు తీసుకునే వారి వద్ద రూ.10 రూపాయల నుంచి రూ.30 వరకు టికెట్ తీసుకుంటున్నారు. ఈ మధ్యకాలంలో అరకు ప్రాంతంలో ఈ రకమైన పర్యటక వాణిజ్య వ్యవసాయం పట్ల రైతుల ఆసక్తి చూపెట్టడం గమనర్హం.
News October 10, 2024
పనుల్లో జాప్యం చేయవద్దు: కలెక్టర్
చిన్న చిన్న సమస్యలను సాకుగా చూపుతూ పనుల్లో జాప్యం చేయడం సరికాదని విశాఖ జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ అన్నారు. విశాఖ జిల్లాలో ఇళ్ల నిర్మాణాల్లో పురోగతి సాధించాలని ఆదేశించారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన, అర్బన్ గ్రామీణ పథకాలపై కలెక్టరేట్లో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇళ్ల నిర్మాణాల ప్రగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. నిర్మాణాలను సకాలంలో పూర్తి చేసేందుకు ప్రణాళికయుతంగా పనిచేయాలన్నారు.
News October 9, 2024
విశాఖ నగరంలో ఏర్పాటు కానున్న TCS..ఎంపీ స్పందన
విశాఖలో టాటా కన్సల్టెన్సీ సర్వీస్ (టీసీఎస్) ఏర్పాటు కానుంది. ఈ మేరకు రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేశ్కు విశాఖ ఎంపీ భరత్ శుభాకంక్షాలు తెలిపారు. ఈ మేరకు X వేదికగా స్పందిస్తూ టాటా గ్రూప్ను ఒప్పించారు. టీసీఎస్ ఏర్పాటు అయితే సుమారు పదివేల మంది స్థానిక యువతకి ఉపాధి లభిస్తుంది. మీరు రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపించాలని చూపిస్తున్న చొరవకు ఎంపీగా అవసరమైనదంతా నేను చేస్తాను అని పేర్కొన్నారు.