News December 30, 2024

గాల్లోకి ఎగిరిన కారు.. మహిళ స్పాట్ డెడ్

image

రోడ్డు ప్రమాదం ఓ కుటుంబాన్ని చిదిమేసింది. టంగుటూరు మండలం వెంకటాయపాలెం గ్రామానికి చెందిన లక్కె పద్మ(47), ఆమె కుమార్తెలు లక్ష్మీ, మాధవిలు బొంతలు కుట్టుకుని జీవిస్తున్నారు. ఆదివారం వాళ్ళు ఆటోలో ఒంగోలు వెళ్తుండగా పెళ్లూరు వద్ద డివైడర్‌ని ఢీకొన్న ఓ కారు గాల్లో ఎగిరి ఆటోపై పడింది. ఘటనలో పద్మ స్పాట్ లో చనిపోయారు. కుమార్తెలు ఇద్దరి పరిస్థితి సీరియస్‌గా ఉంది. దీంతో వెంకటాయపాలెంలో విషాదఛాయలు అలముకున్నాయి

Similar News

News November 16, 2025

ప్రకాశం జిల్లాకు 2 రోజుల పాటు మోస్తరు వర్షసూచన

image

ప్రకాశం జిల్లాకు 2 రోజులపాటు మోస్తరు వర్షాలు కురిసే సూచన ఉన్నట్లు ఏపీ ప్రకృతి విపత్తుల నిర్వహణ సంస్థ శనివారం ప్రకటన విడుదల చేసింది. దీని ప్రభావం జిల్లాలోని పలు మండలాలపై ఉంటుందన్నారు. ఇది ఇలా ఉంటే జిల్లాలో ఇటీవల చలి ప్రభావం రోజురోజుకు పెరుగుతోంది.

News November 15, 2025

ప్రకాశం జిల్లాకు 2 రోజులు పాటు మోస్తరు వర్షసూచన

image

ప్రకాశం జిల్లాకు 2 రోజులపాటు మోస్తరు వర్షాలు కురిసే సూచన ఉన్నట్లు ఏపీ ప్రకృతి విపత్తుల నిర్వహణ సంస్థ శనివారం ప్రకటన విడుదల చేసింది. దీని ప్రభావం జిల్లాలోని పలు మండలాలపై ఉంటుందన్నారు. ఇది ఇలా ఉంటే జిల్లాలో ఇటీవల చలి ప్రభావం అధికంగా కనిపిస్తున్న పరిస్థితి ఉంది.

News November 15, 2025

ప్రకాశం: ‘విద్యార్థులకు సురక్షిత తాగునీరు అందించాలి’

image

వసతి గృహాల్లో ఉంటున్న విద్యార్థులకు సురక్షిత తాగునీరు అందించాల్సిన బాధ్యత సంబంధిత అధికారులపై ఉందని జిల్లా కలెక్టర్ రాజాబాబు అన్నారు. ఒంగోలులోని కలెక్టరేట్లో శుక్రవారం సాయంత్రం సంబంధిత అధికారులతో సమావేశమయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు ప్రజలకు కనీస అవసరాలైన తాగునీరు అందించడంలో ఖర్చు చేస్తుందని వివరించారు.