News June 15, 2024
గిద్దలూరు: మద్యం మత్తులో రైలు కింద పడ్డాడు
మద్యం మత్తులో ఓ వ్యక్తి గూడ్స్ రైలు కింద పడిన ఘటన గిద్దలూరు మండలం దిగువమెట్ట రైల్వే స్టేషన్కి సమీపంలో శనివారం సాయంత్రం చోటు చేసుకుంది. నంద్యాలకు చెందిన బాష అనే వ్యక్తి, మద్యం మత్తులో గుంటూరు వైపుగా వెళ్తున్న గూడ్స్ రైలు కింద పడటంతో స్వల్ప గాయాలయ్యాయి. 108 వాహనంలో క్షతగాత్రుడిని గిద్దలూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.
Similar News
News October 2, 2024
సీఎం చంద్రబాబును కలిసిన ఎంపీ మాగుంట
ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాసంలో CM చంద్రబాబు నాయుడును ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. గృహ, పట్టణ వ్యవహారాల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఛైర్మన్గా తనను నియమించిన సందర్భంగా సీఎంకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అనంతరం సీఎం సైతం మాగుంటకు శుభాకాంక్షలు తెలిపారు.
News October 2, 2024
అభివృద్ధికి అవసరమైన సలహాలు ఇవ్వండి: ప్రకాశం కలెక్టర్
రాష్ట్ర అభివృద్ధికి అవసరమైన సూచనలు, సలహాలు ఇవ్వడంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని ప్రకాశం కలెక్టర్ తమీమ్ అన్సారియా బుధవారం పిలుపునిచ్చారు. ఆ దిశగా స్వర్ణాంధ్ర- 2047 పేరుతో రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సర్వేలో ప్రజలు పాల్గొనాలని సూచించారు. “https://swarnandhra.ap.gov.in” వెబ్సైట్ ఓపెన్ చేసి పేరు, వయస్సు, జిల్లా తదితర వివరాలను పూర్తిచేసిన తర్వాత వచ్చే 11 ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సి ఉంటుందన్నారు.
News October 2, 2024
బాలినేని సైలెంట్కు కారణం అదేనా..?
ఒంగోలుకు చెందిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఇటీవల జనసేన పార్టీలో చేరిన విషయం తెలిసిందే. జనసేన గూటికి చేరిన తర్వాత ఒంగోలుకు వచ్చిన బాలినేనికి ఆ పార్టీ నాయకులు కలిసి మద్దతు పలికారు. జనసేనలోకి భారీ చేరికలు ఉంటాయని బాలినేని అప్పుడు ప్రకటించినా.. సైలెంట్ అయ్యారు. పవన్ దీక్షలో ఉండటంతోనే బాలినేని సైలెంట్ అయ్యారని.. తెర వెనుక పక్కా ప్లాన్తో చేరికలపై అడుగులు వేస్తున్నట్లు చర్చ సాగుతోంది.