News February 25, 2025
గిద్దలూరు: వ్యభిచారానికి పాల్పడుతున్న ఇద్దరు యువకులు అరెస్ట్

గిద్దలూరులోని పీఆర్ కాలనీలో వ్యభిచారానికి పాల్పడుతున్న ఇద్దరు యువకులపై సోమవారం పోలీసులు కేసు నమోదు చేశారు. రాబడిన సమాచారం మేరకు అర్బన్ సీఐ సురేశ్ వ్యభిచార గృహంపై దాడికి దిగారు. ఇద్దరు విటులను, మహిళలను, మరో ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకున్నారు. స్థానిక పోలీస్ స్టేషన్కు తరలించి విటులకు కౌన్సిలింగ్ ఇచ్చి యువకులపై కేసు నమోదు చేశామని సీఐ సురేశ్ తెలిపారు.
Similar News
News April 23, 2025
FLASH: ఒంగోలు మాజీ MLAకు గుండెపోటు

ఒంగోలులో నిన్న రాత్రి టీడీపీ నేత, నాగులుప్పలపాడు మాజీ MPP ముప్పవరపు వీరయ్య చౌదరిని హత్య చేసిన విషయం తెలిసిందే. ఒంగోలు మాజీ MLA ఈదర హరిబాబుకు వీరయ్య చౌదరి మేనల్లుడు అవుతాడు. అల్లుడి మృతి వార్తతో హరిబాబు గుండెపోటుకు గురయ్యారు. ఆయనను వెంటనే ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతున్నారు. మంత్రులు గొట్టిపాటి, స్వామి, ఎమ్మెల్యేలు దామచర్ల, విజయ్ కుమార్, ఉగ్ర నరసింహ రెడ్డి తదితరులు హరిబాబును పరామర్శించారు.
News April 23, 2025
ప్రకాశం జిల్లా 10వ తరగతి పరీక్షల సమాచారం

పదో తరగతి పరీక్షల ఫలితాల విడుదలకు సర్వం సిద్ధమైంది. ఇవాళ ఉదయం 10 గంటలకు మంత్రి నారా లోకేశ్ ఫలితాలను విడుదల చేయనున్నారు. ప్రకాశం జిల్లాలో 29,602 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. మార్చి 17 నుంచి ఏప్రిల్ 1 వరకు పరీక్షలు జరిగాయి.
☞ వే2న్యూస్ యాప్లోనూ ఫలితాలు చెక్ చేసుకోవచ్చు.
News April 22, 2025
యానాది కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని వినతి

యానాదుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి స్వామి చెప్పారు. టంగుటూరు మండలం తూర్పు నాయుడుపాలెంలోని క్యాంపు కార్యాలయంలో యానాది సంఘం ప్రతినిధులు మంత్రిని కలిశారు. యానాది కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని కోరారు. ప్రిమిటివ్ ట్రైబల్ జాబితాలో తమను చేర్చాలని కోరారు. జనాభా దామాషా ప్రాతిపదికన చట్టసభల్లో యానాది సామాజిక వర్గానికి ప్రాధాన్యతివ్వాలని వినతిపత్రం అందజేశారు.