News April 17, 2025
గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో టేకులపల్లి వాసి

టేకులపల్లి మండలం సంపత్నగర్కు చెందిన కుడితేటి రమేశ్కు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో చోటు దక్కింది. క్రిస్టియన్ గీతాలపై ప్రపంచ స్థాయిలో జరిగిన ఆన్లైన్ మ్యూజిక్ ప్రదర్శనలో రమేశ్ పాల్గొనగా కీబోర్డు వాయిద్య బృందం గంటలో 1,046 వీడియోలు అప్లోడ్ చేసింది. ఈ బృందంలో రమేశ్ సభ్యుడు. సోమవారం హోలెల్ మ్యూజిక్ స్కూల్ నిర్వాహకుల చేతుల మీదుగా మెడల్ అందుకున్నారు.
Similar News
News December 17, 2025
ధోనీకి ఇదే చివరి IPL: ఊతప్ప

రానున్న IPL సీజనే ధోనీకి చివరిదని CSK మాజీ ఆటగాడు రాబిన్ ఊతప్ప అన్నారు. ఆపై ఎడిషన్లో ఆడతారని తాను అనుకోవట్లేదని చెప్పారు. ప్రస్తుతం జట్టు కూర్పు చూస్తే అదే అర్థమవుతోందన్నారు. ‘గతేడాది, తాజాగా జరిగిన మినీ వేలంలోనూ యంగ్ క్రికెటర్లపై CSK ఎక్కువగా ఖర్చు చేసింది. అలాగే రుతురాజ్, శాంసన్ వంటి సారథులు జట్టులో ఉన్నారు. ఈ క్రమంలో ధోనీ టీం నుంచి తప్పుకొని మెంటార్గా కొనసాగే అవకాశాలున్నాయి’ అని చెప్పారు.
News December 17, 2025
IPL వేలం.. రాజస్థాన్ టీమ్లో కరీంనగర్ కుర్రాడు

ఐపీఎల్ వేలంలో కరీంనగర్ అబ్బాయి అమన్ రావును రాజస్థాన్ రాయల్స్ టీం రూ.30 లక్షలకు దక్కించుకుంది. రూ.30 లక్షల బేస్ ప్రైజ్తో ఆక్షన్లోకి వచ్చిన అతణ్ని అంతే ధరకు సొంత చేసుకుంది. ఇప్పటికే HCA అండర్-19, అండర్-23 విభాగాలలో అద్భుత ప్రదర్శన చేశారు. అండర్-23 SMATలో 160+ స్ట్రైక్ రేట్తో రాణించాడు. అయితే IPLలో రాణించి కరీంనగర్కు పేరు తీసుకురావాలని జిల్లా వాసులు కోరుతున్నారు.
News December 17, 2025
నేడు, రేపు కలెక్టర్ల సదస్సు

AP: రాష్ట్ర సచివాలయంలోని ఐదో బ్లాకులో బుధవారం 10AMకు 5వ కలెక్టర్ల కాన్ఫరెన్స్ ప్రారంభం కానుంది. సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్షించుకొని లక్ష్యాలకు అనుగుణంగా పని చేసేలా 2 రోజుల కాన్ఫరెన్స్ జరగనుంది. తొలి రోజు 18నెలల పాలనపై సమీక్ష చేసుకొని కలెక్టర్లకు CM దిశానిర్దేశం చేయనున్నారు. 2వ రోజు జిల్లాల్లో ఉత్తమ పద్ధతులు అవలంభించిన కలెక్టర్ల ప్రజెంటేషన్లు, తదితర ప్రోగ్రాంలు ఉండనున్నాయి.


