News June 27, 2024

గిరిజన గ్రామాలకు ఫీడర్ అంబులెన్సులు: మంత్రి

image

గిరిజన గ్రామాలకు ఫీడర్ అంబులెన్సులు ఏర్పాటు చేస్తామని మంత్రి గుమ్మిడి సంధ్యా రాణి తెలిపారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో సమీక్షించారు. గిరిజనుల ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యమివ్వాలని అధికారులను ఆదేశించారు. ఆరోగ్య కేంద్రాలు, ఉప ఆరోగ్య కేంద్రాలలో మందులు అందుబాటులో ఉండేలా పూర్తి చర్యలు చేపట్టాలని సూచించారు. పీహెచ్సీ వైద్యులు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలన్నారు.

Similar News

News July 3, 2024

విజయనగరం: డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్

image

AU పరిధిలో డిగ్రీ ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసినట్లు వర్సిటీ అధికారులు తెలిపారు. ఈ నెల 4,6 తేదీలలో డా.వీఎస్ కృష్ణ కళాశాలలో స్పెషల్ కేటగిరీ సర్టిఫికెట్ల పరిశీలన జరగనుంది. ఈ నెల 10 వరకు రిజిస్ట్రేషన్ చేసుకొని.. 11 తేదీ నుంచి 15 వరకు వెబ్ ఆప్షన్లు ఇవ్వాల్సి ఉంటుంది. 19న సీట్ల కేటాయించి..22 లోపు క్లాసులు ప్రారంభిస్తామని వర్సిటీ అధికారులు తెలిపారు. AU పరిధిలో మొత్తం 163 డిగ్రీ కళాశాలలు ఉన్నాయి.

News July 3, 2024

జిల్లాలో కాన్సర్ బాధితుల కోసం కలెక్టర్‌కు వినతి

image

జిల్లాలో కాన్సర్ బాధితులకు ఎటువంటి వైద్య సహాయం అందించట్లేదని కాన్సర్ ఆసుపత్రి సాధన కమిటీ అధ్యక్షుడు భీశెట్టి బాబ్జీ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ అంబేడ్కర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. మన్యం జిల్లాకు కూడా కలిపి విజయనగరంలో కాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు చేసే ఏర్పాట్లు చేయాలని కోరారు. జిల్లా కేంద్ర ఆసుపత్రిలో కీమోథెరపీ లాంటి చికిత్సలు అందించేలా కృషి చేయాలన్నారు.

News July 2, 2024

BREAKING: పార్వతీపురం జిల్లాకు కొత్త కలెక్టర్ నియామకం

image

పార్వతీపురం మన్యం జిల్లాకు నూతన కలెక్టర్‌గా ఏ.శ్యామ్ ప్రసాద్‌ను నియమించారు. ఈయన పల్నాడు జిల్లా జాయింట్ కలెక్టర్‌గా విధులు నిర్వహించారు. రాష్ట్రంలో పలువురు కలెక్టర్ల బదిలీల్లో భాగంగా మన్యం జిల్లాకు ఈయన రానున్నారు. ఇక్కడ కలెక్టర్‌గా పనిచేస్తున్న నిశాంత్ కుమార్ బదిలీపై వెళ్లారు.