News February 4, 2025
గిరిజన బ్యాంకులు ఏర్పాటు చేయాలని అరకు ఎంపీ వినతి

గిరిజన బ్యాంకులు ఏర్పాటు చేసి గిరిజన ఆర్థిక పురోగతి సాధించడానికి తోడ్పాటు ఇవ్వాలని కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ని మంగళవారం కలిసి వినతి పత్రం అందజేసినట్లు అరకు ఎంపీ గుమ్మ తనుజారాణి తెలిపారు. గ్రామీణ వికాస్ బ్యాంకుల తరహాలో అవి ఉండాలన్నారు. మైక్రో ఫైనాన్స్, వ్యవసాయ రుణాలు, జీవనోపాధికి మద్దతు వంటి అవసరాలు తీరుస్తాయన్నారు. గిరిజన పర్యాటక రుణాలు, పశువుల బీమా, ఆరోగ్య బీమాకల్పించాలన్నారు.
Similar News
News September 15, 2025
గద్వాల: రేపు ఈవీఎంల తనిఖీలు

ఈవీఎంలను మంగళవారం తనిఖీ చేస్తామని కలెక్టర్ సంతోష్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు క్యాంప్లో ఈ కార్యక్రమం జరుగుతుందని చెప్పారు. నెలవారీ తనిఖీల్లో భాగంగా రేపు ఉదయం 9 గంటలకు ఈ తనిఖీలు నిర్వహిస్తామన్నారు. జోగులాంబ గద్వాల జిల్లాలోని వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు ఈ కార్యక్రమానికి హాజరుకావాలని ఆయన కోరారు.
News September 15, 2025
విశాఖ బీచ్ పరిశుభ్రత లోపాలపై కమిషనర్ ఆగ్రహం

విశాఖ వచ్చే పర్యాటకులకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించడమే ధ్యేయమని GVMC కమిషనర్ కేతన్ గార్గ్ స్పష్టం చేశారు. కోస్టల్ బ్యాటరీ నుంచి భీమిలి వరకు ఎక్కడా వ్యర్థాలు కనిపించకూడదని ఆదేశించారు. ఆటుపోట్లు ఎక్కువగా ఉండే పౌర్ణమి, అమావాస్య రోజుల్లో ముందుస్తు ప్రణాళికలు వేసుకోవాలన్నారు. RK బీచ్లో అపరిశుభ్ర వాతావరణం ఉండటంతో బీచ్ స్వీపింగ్ యంత్రాలు నిర్వహించే ఏజెన్సీ ఫామ్టెక్ ప్రతినిధులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
News September 15, 2025
గద్వాల: రుణాలు సకాలంలో మంజూరు చేయాలి: కలెక్టర్

గద్వాల జిల్లాలో నిర్దేశించిన లక్ష్యాల మేరకు అన్ని బ్యాంకులు రైతులకు పంట, అనుబంధ రంగాల రుణాలు, ఉపాధి యూనిట్ల స్థాపన, చిన్న, మధ్య తరహా, విద్యా, గృహ రుణాలు తదితర ప్రాధాన్యతా రంగాల రుణాలను సకాలంలో మంజూరు చేయాలని కలెక్టర్ సంతోష్ ఆదేశించారు. సోమవారం జిల్లా కలెక్టరేట్లో ఎంపీ మల్లు రవితో కలిసి నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. విశ్వకర్మ యోజన కింద అర్హులైన లబ్ధిదారులకు యూనిట్లను మంజూరు చేయాలన్నారు.