News July 10, 2025

గిరి ప్రదక్షిణలో తప్పిపోయిన బాలుడిని తల్లి చెంతకి చేర్చిన పోలీసులు

image

సింహాచలం “గిరి ప్రదక్షిణ”లో పైనాపిల్ కాలనీ సమీపంలో రెండు సంవత్సరాల బాలుడు దిక్కుతోచని స్థితిలో తిరగడం పోలీసులు గమనించి వివరాలు అడగగా చెప్పలేకపోయాడు. వెంటనే పోలీసులు పబ్లిక్ అడ్రెస్సింగ్ సిస్టమ్ ద్వారా బాలుడు గుర్తులు తెలియజేస్తూ ప్రకటన చేశారు. బాలుడు తల్లి అది విని సమీపంలో పోలీసులు ద్వారా అక్కడికి చేరుకున్నారు. బాలుడిని ఆమెకు క్షేమంగా అప్పగించారు. పోలీసులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.

Similar News

News July 10, 2025

జగిత్యాల: ఎన్నికలకు సిద్ధం కండి: RS ప్రవీణ్ కుమార్

image

BRS నేతలు, కార్యకర్తలు జోష్ పెంచాలని, ప్రతి గ్రామంలో ముమ్మరంగా పర్యటించాలని, ఎన్నికల సమరానికి సిద్ధం కావాలని ఆ పార్టీ రాష్ట్ర నాయకుడు RS ప్రవీణ్ కుమార్ పిలుపునిచ్చారు. గురువారం జగిత్యాల జిల్లా మల్లాపూర్‌లో BRS కొత్త ఆఫీస్‌ను ఆయన ప్రారంభించి మాట్లాడారు. ప్రజా సమస్యలపై నిత్యం పోరాడాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్‌, MLA కల్వకుంట్ల సంజయ్ కుమార్, BRS నాయకులు పాల్గొన్నారు.

News July 10, 2025

త్వరలో ఆదర్శ రైతుల ద్వారా పథకాల అమలు: రైతు కమిషన్

image

TG: త్వరలో గ్రామానికి ఒక ఆదర్శ రైతును ఎంపిక చేయనున్నట్లు రాష్ట్ర వ్యవసాయ, రైతు కమిషన్ ఛైర్మన్ కోదండరెడ్డి తెలిపారు. గ్రామాల్లో ప్రభుత్వ స్కీములను వారి ద్వారా అమలు చేస్తామన్నారు. అయితే ఆదర్శ రైతులకు వేతనాలు ఉండవని స్పష్టం చేశారు. కాగా 2007లో కాంగ్రెస్ సర్కార్ ఈ వ్యవస్థను తీసుకొచ్చింది. గౌరవ వేతనం కింద నెలకు రూ.1,000 అందించింది. 2017లో BRS ప్రభుత్వం ఆదర్శ రైతు వ్యవస్థను రద్దు చేసింది.

News July 10, 2025

సంగారెడ్డి: ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్‌గా మురళీకృష్ణ

image

సంగారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్‌గా డాక్టర్ మురళీకృష్ణ గురువారం బాధ్యతలు స్వీకరించారు. వరంగల్ ఎంజీఎం ఆసుపత్రి నుంచి ఆయన ఇక్కడికి బదిలీపై వచ్చారు. ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తానని చెప్పారు. వైద్యులు సహకరించాలని కోరారు.