News July 10, 2025
గిరి ప్రదక్షిణ విజయవంతంలో వీరి పాత్ర కీలకం

సింహాచలం గిరి ప్రదక్షిణ విజయవంతంలో ప్రధానంగా 3 వర్గాల పాత్ర అత్యంత కీలకం. స్వచ్ఛంద సేవా సంస్థలు, పోలీసు, పారిశుద్ధ్య కార్మికులిది ప్రధాన భూమిక. లక్షల సంఖ్యలో వచ్చే భక్తులకు తాగునీరు, ఇతర ఆహార పదార్థాలు అందజేయడంలో స్వచ్ఛంద సంస్థలు, భక్తులు రోడ్డుపై వేసే చెత్త తొలగించే పనిలో పారిశుద్ధ్య కార్మికులు, ట్రాఫిక్ నియంత్రణలో పోలీసులు విశేష కృషి చేశారు. గిరి ప్రదక్షిణ విజయవంతంలో వీరి కృషి ప్రశంసనీయం.
Similar News
News July 11, 2025
మద్దూర్: పురుగుమందు తాగి మహిళ ఆత్మహత్య

ఓ మహిళ పురుగుమందు తాగి మృతి చెందిన ఘటన మద్దూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ధమగ్నాపూర్లో చోటుచేసుకుంది. ఎస్ఐ విజయ్ తెలిపిన వివరాలు.. ఈనెల 8వ తేదీన గ్రామానికి చెందిన జోగు మౌనిక ఆర్థిక(35) ఇబ్బందులతో పురుగుమందు తాగింది. చికిత్స కుటుంబసభ్యులు నిమిత్తం HYD నిమ్స్కి తరలించారు. చికిత్స పొందుతూ గురువారం మృతిచెందింది. ఈమేరకు కేసు నమోదైంది.
News July 11, 2025
ఏటూరునాగారం: GREAT.. 2 కి.మీ నడిచి వైద్య శిబిరం

జ్వరం వస్తే ఆసుపత్రికి రావాలని, సొంత చికిత్సలు చేసుకోవద్దని ఏటూరునాగారం మండలం గంటలకుంట గుత్తికోయలకు వైద్యాధికారి సుమలత సూచించారు. గ్రామానికి సరైన రోడ్డు మార్గం లేకపోవడంతో సుమారు 2 కి.మీ నడిచి హెల్త్ క్యాంపు నిర్వహించినట్లు తెలిపారు. క్యాంపులో 28 మందికి పరీక్షలు నిర్వహించి, జ్వరాల బారిన పడ్డ ఐదుగురికి మందులను పంపిణీ చేశామన్నారు. వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని సూచించినట్లు పేర్కొన్నారు.
News July 11, 2025
రాయపర్తి: తల్లి చెంతకు వచ్చి వెళ్తుండగా అనంత లోకాలకు!

తల్లి చెంతకు వచ్చి తిరిగి వెళ్తుండగా కుమారుడు అనంతలోకాలకు వెళ్లిన ఘటన ఆ గ్రామంలో అందరిని కలచివేసింది. వరంగల్ జిల్లా రాయపర్తి మండలంలోని మైలారం గ్రామానికి చెందిన గాడిపెళ్లి వెంకటయ్య-రజిత దంపతుల కుమారుడు రంజిత్(24) హైదరాబాదులో ఓ ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడు. ఐదేళ్ల క్రితం తండ్రి చనిపోవడంతో తల్లి గ్రామంలోనే ఉంటోంది. తల్లిని చూసి తిరిగి వెళ్తుండగా పాలకుర్తిలో బస్సు ప్రమాదంలో మృతి చెందాడు.