News April 14, 2025
గుంటూరులో ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమం రద్దు: ఎస్పీ

నేడు డా.B.R.అంబేడ్కర్ జయంతి సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ సతీశ్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆదివారం గుంటూరులో ఆయన మాట్లాడారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో అర్జీలు ఇవ్వాలనుకున్న ప్రజలు గమనించవలసిందిగా కోరారు.
Similar News
News April 15, 2025
రఘురామ కస్టోడియల్ టార్చర్ కేసులో విచారణ వాయిదా

ఎంపీ రఘురామ కృష్ణంరాజుకు సంబంధించిన కస్టోడియల్ టార్చర్ కేసులో గుంటూరు జీజీహెచ్ మాజీ సూపరింటెండెంట్ ప్రభావతి దాఖలు చేసిన పిటిషన్పై మంగళవారం విచారణ జరిగింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వ్యక్తిగత కారణాలతో హాజరు కాలేదని కోర్టుకు తెలిపారు. దీంతో జస్టిస్ విక్రమ్ నాథ్ ధర్మాసనం విచారణను ఈనెల 24వ తేదీకి వాయిదా వేసింది.
News April 15, 2025
WFH సర్వేలో గుంటూరు జిల్లా ‘లో స్పీడ్’

ఇంటి నుంచే ఉద్యోగాల కల్పన కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన వర్క్ ఫ్రమ్ హోం (WFH) సర్వేలో గుంటూరు జిల్లా వెనుకబడింది. జిల్లాలో మొత్తం 11.25 లక్షల మందిలో ఇప్పటి వరకు కేవలం 6.20 లక్షల మందిపైనే సర్వే పూర్తైంది. ఇంకా 5 లక్షల మందికి పైగా సర్వే పెండింగ్లో ఉంది. 18 నుంచి 50 ఏళ్ల మధ్య వయస్సు గల ప్రజలను సర్వే చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. సర్వే వేగంగా పూర్తిచేయాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది.
News April 15, 2025
అమరావతి నిర్మాణం కోసం 44,676 ఎకరాల భూ సేకరణ

అమరావతి రాజధాని నిర్మాణం కోసం ప్రభుత్వం మరోసారి భారీ భూసేకరణకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. తుళ్లూరు, అమరావతి, తాడికొండ, మంగళగిరి మండలాల్లోని పలు గ్రామాల నుంచి మొత్తం 44,676.647 ఎకరాల భూమిని ల్యాండ్ పూలింగ్ ద్వారా సేకరించనున్నట్లు తెలుస్తోంది. తుళ్లూరు మండలంలో 16,407 ఎకరాలు, అమరావతి 7,306 ఎకరాలు, తాడికొండ 16,469ఎకరాలు, మంగళగిరి మండలంలో 4,492ఎకరాలు సేకరించనున్నట్లు సమాచారం. దీనిపై మీ COMMENT.