News October 26, 2025
గుంటూరులో ప్రమాదం.. తెగిపడిన కాలు..!

పట్టాభిపురం పీఎస్ పరిధిలోని కృష్ణనగర్ కుందుల రోడ్డులో ప్రమాదం జరిగింది. కొరిటెపాడు ప్రాంతానికి చెందిన సురేష్ ద్విచక్రవాహనంపై వెళ్తుండగా టిప్పర్ లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో సురేష్కి తీవ్రగాయాలయ్యాయి. ఓ కాలు పూర్తిగా తెగిపోయింది. చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారని స్థానికులు చెప్తున్నారు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News October 26, 2025
తుపాన్ హెచ్చరికలు.. PGRS రద్దు: కలెక్టర్

మెంథా తుపాన్ దృష్ట్యా సోమవారం నిర్వహించాల్సిన పీజీఆర్ఎస్ను రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నందున ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకుని ఇళ్ల వద్దనే ఉండాలన్నారు. ఈ విషయాన్ని గమనించి అధికారులకు సహకరించాలని కలెక్టర్ కోరారు.
News October 26, 2025
GNT: గుమ్మడి సాగుతో అధిక దిగుబడి

ఉమ్మడి గుంటూరు జిల్లాలో అంతర పంటల సాగుతో రైతులు అధిక లాభాలు అర్జిస్తున్నారు. ప్రధాన పంటలో గుమ్మడి కాయ ఒకటి. ఎకరాకు రూ.11 వేల వరకు పెట్టుబడితో 90 నుంచి 120 రోజుల్లో.. ఎకరాకు 4 నుంచి 6 టన్నుల వరకు దిగుబడి వస్తుందని, రూ. 50 నుంచి 80వేల వరకు ఆదాయం వస్తుందని రైతులు చెబుతున్నారు. జూన్-జులై, డిసెంబర్-జనవరి నెలలు సాగుకు అనువైన సమయం.
#నేడు జాతీయ గుమ్మడి కాయ దినోత్సవం
News October 26, 2025
గుంటూరులో నాన్ వెజ్ ధరలు ఇవే..!

గుంటూరులో ఆదివారం నాన్ వెజ్ ధరలు ఇలా ఉన్నాయి. స్కిన్ లెస్ చికెన్ కేజీ రూ.220, స్కిన్తో రూ. 200కి విక్రయిస్తున్నారు. మటన్ ధర కేజీ రూ.900 వద్ద స్థిరంగా ఉంది. చేపలలో కొరమేను రూ.440, రాగండి రూ.170, బొచ్చ రూ.220గా ఉంది. చేపలను కొనుగోలు చేయడానికి నాన్ వెజ్ ప్రియులు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారని వ్యాపారులు తెలిపారు. మరి మీ ప్రాంతంలో ధరలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.


