News March 13, 2025
గుంటూరులో ఫైనాన్స్ కంపెనీ భారీ మోసం

ఐదున్నర కిలోల బంగారం తాకట్టు పెడితే కేవలం వెయ్యి గ్రాములే అని ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థ ఉద్యోగులు పత్రాలు సృష్టించి ఓ వైద్యురాలిని మోసం చేశారు. పోలీసుల కథనం మేరకు.. ముత్యాలరెడ్డి నగర్కి చెందిన ఓ వైద్యురాలు అరండల్పేటలోని ఓ ప్రయివేట్ ఫైనాన్స్ కంపెనీలో ఐదున్నర కిలోల బంగారాన్ని తాకట్టు పెట్టారు. సంస్థలో పనిచేసే ఐదుగురు సిండికేట్గా ఏర్పడి నాలుగున్నర కేజీల బంగారాన్ని తప్పుడు పత్రాలతో కాజేశారు.
Similar News
News March 14, 2025
గుంటూరు జిల్లా ఎస్పీ వార్నింగ్

గుంటూరు జిల్లా ప్రజలు స్నేహపూర్వక వాతావరణంలో మత సామరస్యానికి ప్రతీకగా హోలీ పండుగ జరుపుకోవాలని గుంటూరు జిల్లా ఎస్పీ సతీశ్ కుమార్ సూచించారు. ఇతర మతస్థుల వ్యక్తిగత స్వేచ్ఛను, వారి మతాచారాలను గౌరవిస్తూ వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు. ఆకతాయి చేష్టలకు, అల్లర్లకు తావివ్వకుండా శాంతి భద్రతలకు విఘాతం కలుగకుండా చేయాలన్నారు. ఇతర మతస్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా చేస్తే చర్యలు తప్పవన్నారు.
News March 13, 2025
తుళ్లూరు: చంద్రబాబును కలిసిన డీఆర్డీవో మాజీ ఛైర్మన్

డీఆర్డీవో మాజీ ఛైర్మన్, ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ డాక్టర్ జి సతీష్ రెడ్డి గురువారం సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో పారిశ్రామిక అభివృద్ధికి ఉన్న అవకాశాలను, ముఖ్యంగా డిఫెన్స్ రంగంలో పరిశ్రమలు నెలకొల్పేందుకు సంబంధించి ముఖ్యమంత్రికి ప్రజెంటేషన్ ఇచ్చారు.
News March 13, 2025
మరో కేసులో బోరగడ్డ అనిల్కు రిమాండ్

YCP నేత బోరుగడ్డ అనిల్పై మచిలీపట్నం చిలకలపూడి పోలీసులు పీటీ వారెంట్ జారీ చేశారు. సోషల్ మీడియాలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్లపై దూషణ కేసులో అనిల్ కుమార్ ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నాడు. ఆయనపై గతంలో చిలకలపూడి PSలో 2 కేసులు నమోదై ఉన్నాయి. ఈ కేసుల్లో ఆయనను విచారించేందుకు రాజమండ్రి నుంచి కాసేపటి క్రితం అనిల్ను పోలీసులు మచిలీపట్నం తీసుకువచ్చి జడ్జి ముందు హాజరుపర్చగా రిమాండ్ విధించారు.