News August 16, 2025
గుంటూరులో విషాదం.. ఇద్దరు పిల్లలతో తండ్రి ఆత్మహత్య

గుంటూరులోని సాయిబాబా నగర్లో దారుణం జరిగింది. నరసరావుపేటలో ఆటో డ్రైవర్గా పని చేస్తున్న ఓ వ్యక్తి కుటుంబ కలహాలతో తన ఇద్దరు మగ పిల్లలను తీసుకుని శనివారం సాయిబాబా నగర్లో ఉంటున్న తన అక్క ఇంటికి వచ్చాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో పిల్లలకు ఎలుకల మందు ఇచ్చి, అనంతరం తాను ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందడంతో ఆ ప్రాంతంలో విషాదం నెలకొంది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News August 17, 2025
నేటి ముఖ్యాంశాలు

* TG: భారీ వర్షసూచన.. మరింత అప్రమత్తంగా ఉండాలి: CM రేవంత్
* కాళేశ్వరం ప్రాజెక్టుకు ఒక నీతి.. పోలవరానికి మరో నీతా: KTR
* చంద్రబాబుకు మద్దతుగా రేవంత్: జగదీశ్ రెడ్డి
* AP: ఫ్రీ బస్సు టికెట్తో సెల్ఫీ దిగండి: మంత్రి లోకేశ్
* తిరుమలకు ఫ్రీ బస్ స్కీమ్ వర్తించదు: అధికారులు
* కృష్ణా, గోదావరి పరివాహక ప్రాజెక్టులకు భారీగా వరద
News August 17, 2025
ప.బెంగాల్ ‘న్యూ కశ్మీర్’గా మారుతోంది: వివేక్ అగ్నిహోత్రి

ప.బెంగాల్లో జనాభా మార్పులపై ఫిల్మ్ డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి ఆందోళన వ్యక్తం చేశారు. ఆ రాష్ట్రాన్ని ‘న్యూ కశ్మీర్’గా అభివర్ణించారు. ఫేక్ IDలతో వస్తున్న అక్రమ వలసదారులకు బెంగాల్ ప్రభుత్వం అధికారాలు కల్పిస్తోందన్నారు. 1946 కలకత్తా అల్లర్లపై ఆయన తీసిన ‘The Bengal Files’ మూవీ ట్రైలర్ లాంచ్ను ఇవాళ పోలీసులు రెండుసార్లు అడ్డుకున్నారు. దీంతో వాక్ స్వాతంత్య్రాన్ని అణచివేస్తున్నారని ఆయన ఫైరయ్యారు.
News August 17, 2025
సరోగసి కేసు: మరిన్ని ఆసుపత్రులకు నోటీసులు

TG: <<17423890>>సరోగసి<<>> కేసులో నిందితురాలు లక్ష్మి పలు ఆసుపత్రులకు ఏజెంట్గా ఉన్నట్లు పోలీసుల విచారణలో తేలింది. దీంతో హెగ్డే, లక్స్ ఆసుపత్రి, అను టెస్ట్ ట్యూబ్ సెంటర్, ఈవీఎఫ్, ఫర్టీ కేర్, అమూల్య ఫెర్టిలిటీ, శ్రీ ఫెర్టిలిటీ సెంటర్లకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. కాగా సృష్టి ఫర్టిలిటీ కేసులో డాక్టర్ నమ్రత నేరం అంగీకరించిన సంగతి తెలిసిందే.