News May 15, 2024
గుంటూరు: ఎన్నికల ఫలితాలపై రూ.లక్షల్లో పందేలు

ఉమ్మడి గుంటూరు జిల్లాలో పోలింగ్ ముగియగా.. జూన్ 4న వెలువడనున్న ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ క్రమంలో పందేలు జోరందున్నట్లు తెలుస్తోంది. పార్టీలకు వచ్చే సీట్లపై, అభ్యర్థుల గెలుపోటములపై భారీగా బెట్టింగులు నడుస్తున్నట్లు సమాచారం. మరోవైపు, మంగళగిరిలో లోకేశ్ గెలుపు, మెజార్టీలపై రూ.లక్షల నుంచి రూ.కోట్లలో పందేలు వేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది.
Similar News
News November 1, 2025
వాట్సాప్ గ్రూపుల్లో సమాచారంపై అప్రమత్తంగా ఉండాలి: ఎస్పీ

వాట్సాప్ గ్రూపుల్లో ప్రచారం అవుతున్న సమాచారంపై అప్రమత్తంగా ఉండాలని గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ సూచించారు. సామాజిక మాధ్యమాలను సరైన మార్గంలో వినియోగించడమే నోటీసుల ఉద్దేశమని తెలిపారు. గ్రూప్ అడ్మిన్లు సభ్యుల వివరాలు, సమాచారంపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. అసత్య ప్రచారం, రెచ్చగొట్టే పోస్టులపై ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని, ధృవీకరించిన సమాచారాన్నే పంచాలని ఎస్పీ విజ్ఞప్తి చేశారు
News November 1, 2025
గుంటూరులో ఈ నెల 7న జాబ్ మేళా

రాష్ట్ర నైపుణ్యాభివృద్ది సంస్థ ఈ నెల 7న గుంటూరు లాం చలపతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో జాబ్ మేళా నిర్వహించనుంది. జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా శనివారం జాబ్ మేళా పోస్టర్ ఆవిష్కరించారు. 30కి పైగా కంపెనీలు పాల్గొని వెయ్యికి పైగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాయని అన్నారు. 10వ తరగతి నుంచి బీటెక్ చదువుకున్న విద్యార్థులు ఈ జాబ్ మేళాలో పాల్గొనవచ్చని చెప్పారు.
News October 31, 2025
పంట పొలాల్లో వర్షపు నీటిని బయటకు పంపాలి: కలెక్టర్

పంటపొలాల్లో వర్షపు నీటిని బయటకు పంపాలని జలవనరుల శాఖ ఇంజినీరింగ్ అధికారులను కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా ఆదేశించారు. జలవనరుల శాఖ ఇంజినీరింగ్ అధికారులు, నీటి వినియోగదారుల సంఘం ప్రతినిధులతో కలెక్టర్ శుక్రవారం సమీక్ష నిర్వహించారు. పంట దెబ్బతినకుండా కాపాడాలని సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీచేసి ఉన్నారని గుర్తు చేశారు. జలవనరుల శాఖ పర్యవేక్షక ఇంజినీర్ వెంకటరత్నం తదితరులు పాల్గొన్నారు.


