News February 10, 2025
గుంటూరు: ఎమ్మెల్సీ ఎన్నికల అబ్జర్వర్గా కరుణ

ఉమ్మడి కృష్ణా-గుంటూరు జిల్లాల పట్టభద్రుల శాసనమండలి ఎన్నికల పరిశీలకురాలిగా వి.కరుణ నియమితులయ్యారు. ఈ మేరకు సోమవారం గుంటూరు కలెక్టరేట్ను ఆమె సందర్శించారు. కలెక్టర్ నాగలక్ష్మీ పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. అనంతరం ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లు, నామినేషన్లతో పాటూ ఇతర వివరాలను ఎన్నికల పరిశీలకురాలికి కలెక్టర్ వివరించారు.
Similar News
News February 11, 2026
బడ్జెట్ సమావేశాల్లో గుంటూరు గళం వినిపించనుందా?

అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానుండటంతో గుంటూరు జిల్లాకు చెందిన కూటమి ఎమ్మెల్యేలు అసెంబ్లీలో గళం విప్పేందుకు సిద్ధమయ్యారు. జిల్లాలో ఇద్దరు కీలక మంత్రులు ఉండటంతో పెండింగ్ నిధులు మంజూరవుతాయని ఆశలు వ్యక్తమవుతున్నాయి. సాగునీరు, తాగునీటి సమస్యలు, పెండింగ్ ప్రాజెక్టుల పూర్తి, డ్రైనేజ్, వీధి కుక్కల నియంత్రణ, ఆసుపత్రులు, రోడ్ల అభివృద్ధికి నిధులు కేటాయించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
News February 11, 2026
సేవా రంగంలో గుంటూరు టాప్.. మిగతావాటిలో వెనుకబాటు

సేవా రంగంలో గుంటూరు జిల్లా 97 స్కోరుతో రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచి ‘A+’ గ్రేడ్ సాధించింది. కానీ, టీనేజ్ గర్భధారణల్లో (8-10%) జిల్లా ఆందోళనకర స్థాయిలో ఉండటం గమనార్హం. పదో తరగతి అసెస్మెంట్లోనూ విద్యార్థులు C, D గ్రేడ్లకే పరిమితమయ్యారు. మరోవైపు, రైల్వే బ్రిడ్జిల (ROB) పనులు నత్తనడకన సాగుతున్నాయి. భూసేకరణ సమస్యలతో జాప్యం జరుగుతోంది. వీటిపై దృష్టి సారించకపోతే ఇబ్బందులు తప్పవు.
News February 11, 2026
GNT: ఇంటర్నెట్ భద్రత పోస్టర్ ఆవిష్కరించిన కలెక్టర్

సేఫర్ ఇంటర్నెట్ డే 2026 సందర్భంగా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా, జేసీ అశుతోష్ శ్రీవాస్తవ, జిల్లా రెవెన్యూ అధికారి ఎన్.ఎస్.కె.ఖాజావలి, నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ (ఎన్.ఐ.సీ) బృందం సమక్షంలో మహత్తరమైన సేఫర్ ఇంటర్నెట్ డే 2026 పోస్టర్ విడుదల చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ఇంటర్నెట్ బాధ్యతాయుత వినియోగం పై అవగాహన పెంచే సందేశాలు పోస్టర్లో ఆకర్షణీయంగా ముద్రించడం జరిగిందన్నారు.


