News October 9, 2025
గుంటూరు: గంజాయి కేసుల దర్యాప్తుపై అవగాహన

గంజాయి, ఇతర మాదకద్రవ్యాల కేసుల దర్యాప్తు వేగవంతం చేయడమే లక్ష్యంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో
బుధవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాల మేరకు జిల్లా శిక్షణా కేంద్రం (DTC), ఈగిల్ విభాగం సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో NDPS చట్టంలోని సీజ్, శాంప్లింగ్, డిస్పోజల్ వంటి అంశాలపై పోలీసు సిబ్బందికి సీసీఎస్ డీఎస్పీ మధుసూదన్ రావు అవగాహన కల్పించారు. DTC సీఐ ఈగల్ సీఐ ఉన్నారు.
Similar News
News October 9, 2025
ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్గా సమంతపూడి

ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం వైస్ ఛాన్స్లర్గా సమంతపుడి వెంకట సత్యనారాయణ రాజును నియమించారు. ఇతను ఉత్తరప్రదేశ్లోని వారణాసి బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో కీటకాలజీ విభాగ ప్రొఫెసర్గా పనిచేశారు. బుధవారం సమంతపూడి వెంకట సత్యనారాయణ రాజును కొత్త వైస్ ఛాన్సలర్గా నియమిస్తూ ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ ఉత్తర్వులు జారీ చేశారు.
News October 8, 2025
‘తెనాలి తహశీల్దార్ సంతకం ఫోర్జరీ’

తెనాలి తహశీల్దార్ గోపాలకృష్ణ సంతకాన్ని కొందరు ఫోర్జరీ చేసి నకిలీ ఫామిలీ మెంబర్ సర్టిఫికెట్ తయారు చేశారు. MRO గోపాలకృష్ణ కథనం మేరకు.. వినుకొండ SBI మేనేజర్ ఓ ప్రాపర్టీ కొనుగోలు నిమిత్తం అమ్మేవారి తాలూకా ఫ్యామిలీ సర్టిఫికెట్ తెనాలి రిజిస్ట్రేషన్ కార్యాలయంలో సమర్పించారు. ప్రాథమిక విచారణలో సర్టిఫికెట్ నకిలీ అని తేలింది. ఈ ఘటనపై పూర్తిస్థాయి విచాణ చేసి చర్యలు తీసుకోవాలని MRO పోలీసులకు ఫిర్యాదు చేశారు.
News October 8, 2025
ANU: బీ.ఫార్మసీ, ఫార్మా.డి. పరీక్షలు ప్రారంభం

ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం పరిధిలో బుధవారం నుంచి బీ.ఫార్మసీ రెండవ సెమిస్టర్ (రెగ్యులర్), ప్రథమ సెమిస్టర్ (సప్లమెంటరీ) పరీక్షలతో పాటు ఫార్మా.డి. పరీక్షలు సజావుగా ప్రారంభమయ్యాయి. బి.ఫార్మసీ పరీక్షలు18 పరీక్షా కేంద్రాల్లోను, ఫార్మా.డీ.పరీక్షలు 10 పరీక్ష కేంద్రాల్లో జరుగుతున్నాయి. విశ్వవిద్యాలయం పీజీ, వృత్తి విద్యా కోర్సుల పరీక్షల సమన్వయకర్త ఆచార్య ఎం.సుబ్బారావు పరీక్షలను పరిశీలించారు.