News March 31, 2024

గుంటూరు జిల్లాలో ఇప్పటి వరకు రూ. 1,29,74,584 విలువైన నగదు స్వాధీనం

image

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో గుంటూరు జిల్లాలో ప్లయింగ్ స్క్వాడ్ ల తనిఖీలు ముమ్మరంగా సాగుతున్నాయి.
ఇందులో భాగంగా శనివారం నిర్వహించిన వాహనాల తనిఖీలలో గుంటూరు వెస్ట్ నియోజకవర్గ పరిధిలో రూ. 2,44,000, ప్రత్తిపాడు నియోజకవర్గ పరిధిలో రూ. 1,00,000 నగదును స్వాధీనం చేసుకున్నారు. సరియైన అర్ధాలు చూపకపోవటంతో సీజ్ చేయటం జరిగిందని అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు రూ. 1,29,74,584 నగదును స్వాధీనం చేసుకున్నారు.

Similar News

News February 19, 2026

GNT: నిధుల వినియోగంపై ఆంక్షలు.. సర్పంచుల ఆవేదన

image

ఏప్రిల్ 2తో సర్పంచుల పదవీకాలం ముగియనున్న వేళ గ్రామాల్లో పనుల బిల్లులపై అనిశ్చితి నెలకొంది. ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఆర్థిక సంఘం నిధులు సుమారు రూ.70 కోట్లు ఉన్నా వాటిని విద్యుత్ బిల్లులు, చెత్త నిర్వహణకే పరిమితం చేశారు. దీంతో అభివృద్ధి పనులు నిలిచిపోయాయని సర్పంచులు అంటున్నారు. ఇప్పటికే చేసిన పనుల బిల్లులు పెండింగ్‌లో ఉండటంతో కాంట్రాక్టర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆంక్షలు సడలించాలని అంటున్నారు.

News February 19, 2026

నేడు మంగళగిరిలో పర్యటించనున్న జిల్లా కలెక్టర్

image

గుంటూరు కలెక్టర్ తమీమ్ అన్సారియా గురువారం మంగళగిరిలోని తాడేపల్లి నగరపాలక సంస్థలో పర్యటించనున్నారు. పార్కులు, మోడల్ టాయిలెట్స్, జంక్షన్ల అభివృద్ధి పనులను పరిశీలించనునట్లు అధికారులు తెలిపారు. ఉదయం 9 గంటలకు కాజలోని యానిమల్ బర్త్ కంట్రోల్ సెంటర్‌ను సందర్శిస్తారు. ఆయా పనుల పరిశీలన అనంతరం 11 గంటలకు MTMC కార్యాలయంలో జరిగే నియోజకవర్గ సమీక్షలో పాల్గొననున్నట్లు ఆమె కార్యాలయ సిబ్బంది తెలిపారు.

News February 19, 2026

అమరావతిలో దసపల్లా హోటల్ పనులు షురూ

image

అమరావతిలో దసపల్లా 4-స్టార్ హోటల్ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. ఇందులో లగ్జరీ గదులు, సూట్స్, ప్రీమియం సర్వీస్ అపార్ట్‌మెంట్లు అందుబాటులో ఉంటాయి. రెస్టారెంట్లు, కన్వెన్షన్ సెంటర్, కాన్ఫరెన్స్ హాల్‌ను ఏర్పాటు చేస్తున్నారు. స్విమ్మింగ్ పూల్, వెల్‌నెస్ సెంటర్, హెల్త్ క్లబ్ వంటి అత్యాధునిక సౌకర్యాలతో ఈ హోటల్ రూపుదిద్దుకుంటోంది. రాజధానిలో ఆతిథ్య రంగానికి ఇది మరింత ఊతమివ్వనుంది.