News February 26, 2025
గుంటూరు జిల్లాలో రేపు పాఠశాలలకు సెలవు: DEO

గుంటూరు-కృష్ణా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఈనెల 27న గురువారం ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు అన్నింటికీ సెలవు ప్రకటిస్తున్నట్లు గుంటూరు జిల్లా విద్యాశాఖ అధికారి సీవీ రేణుక తెలిపారు. ఉప విద్యాశాఖ అధికారులు, మండల విద్యాశాఖ అధికారులు పాఠశాలల యాజమాన్యాలకు తెలియజేయాలని ఆదేశించారు. నిబంధనలు ఉల్లంఘించిన పాఠశాలలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Similar News
News February 26, 2025
తాడేపల్లి: వరుడికి HIV.. నిలిచిపోయిన పెళ్లి

తాళి కట్టే సమయంలో వివాహం నిలిచిపోయిన ఘటన గుంటూరు జిల్లా తాడేపల్లిలో మంగళవారం చోటుచేసుకుంది. తాడేపల్లిలోని ఓ చర్చిలో క్రైస్తవ పద్ధతిలో వివాహ కార్యక్రమం జరుగుతున్న సమయంలో HIV డిస్టిక్ ప్రాజెక్టు మహిళా ప్రతినిధులు చర్చి పాస్టర్కు వరుడికి HIV ఉందని తెలిపారు. దీంతో పాస్టర్ పెళ్లిని నిలిపివేశారు. అనంతరం వరుడి బంధువులు వధువు బంధువులతో వాగ్వాదానికి దిగారు. పోలీసులకు రంగప్రవేశంతో వివాదం సద్దుమణిగింది.
News February 26, 2025
తాడేపల్లి: అంతర్జాతీయ స్కేటింగ్ పోటీలకు హశిశ్ ఎంపిక.!

తైవాన్లో చైనీస్ తైపీ రోలర్ స్పోర్ట్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో మార్చి 24 నుంచి 30 వరకు జరిగే అంతర్జాతీయ స్కేటింగ్ పోటీలకు, ఇండియా నుంచి తాడేపల్లి దూలాస్ నగర్కు చెందిన మేరుగుపాల హశిశ్ ఎంపికయ్యారు. ఈ మేరకు ఫెడరేషన్ అధ్యక్షులు లీయూ పు-త్సాయ్ ఉత్తర్వులను మంగళవారం పంపారు. హశిశ్ ఆర్టిస్ట్ స్కేటింగ్ విభాగంలో ప్రీ స్టైల్, ఇన్ లైన్, సోలో డాన్స్ పోటీలలో తలపడతాడు. కాబట్టి ఈ బుడతడికి కంగ్రాట్స్ చెబుదాం.
News February 25, 2025
గుంటూరు : ఘోర ప్రమాదం.. మృతులు వీరే..!

గుంటూరులోని గోరంట్లలో రోడ్డు ప్రమాదం జరిగి ఇద్దరు మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే మృతులు తల్లీ, కూతురుగా పోలీసులు నిర్ధారించారు. అడవితక్కెళ్లపాడు టిడ్కో గృహాల్లో నివాసం ఉంటున్న వింజమూరి నాగలక్ష్మి (38), చరణ్య (14) లు చిల్లీస్ రెస్టారెంట్ వద్ద రహదారిని క్రాస్ చేస్తుండగా ఈ ప్రమాదం సంభవించిందని తెలుస్తోంది. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు నల్లపాడు పోలీసులు తెలిపారు.