News March 20, 2024
గుంటూరు జిల్లా పోలీసులకు ముఖ్యమంత్రి శౌర్య పతకాలు

ఉగాది పర్వదినం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ శాఖలో ప్రతిభ కనబరిచిన పోలీస్ అధికారులకు, సీఎం శౌర్య పతకం మంగళవారం ఉన్నతాధికారులు ప్రకటించారు. వారిలో గుంటూరు జిల్లా మేడికొండూరు సీఐగా పనిచేసిన కె.వాసును ముఖ్యమంత్రి శౌర్య పతకానికి ఎంపిక చేశారు. ఇంటెలిజెన్స్లో ఉన్న ఎస్ఐ మధుసూదన్ రావు, ఆర్ఐ వెంకటరమణ, R SI సంపత్ రావు, కానిస్టేబుళ్లు త్రిమూర్తులు, భాస్కరరావులకు ముఖ్యమంత్రి శౌర్య పతకం వరించింది.
Similar News
News January 9, 2026
గుంటూరులో MDMA మత్తు పదార్థాల పట్టివేత

గంజాయి, MDMA మత్తు పదార్థాలను కొత్తపేట పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. న్యూ గుంటూరు రైల్వే స్టేషన్ వద్ద మున్నా, చిల్లర ప్రేమ కుమార్ విక్రయదారుల నుంచి లిక్విడ్ గంజాయి, MDMA 3.12 గ్రాములు స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. గుంటూరు నగరంలో మత్తు పదార్థాల విక్రయం, సేవనం చేస్తే కఠిన చర్యలు తప్పవని ఈస్ట్ డీఎస్పీ అబ్దుల్ అజీజ్ హెచ్చరించారు. నిందితులకు న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించిందన్నారు.
News January 9, 2026
పది విద్యార్థులు ఫ్లయింగ్ కలర్స్తో పాస్: గుంటూరు కలెక్టర్

పదో తరగతి విద్యార్థులు అందరూ ఫ్లయింగ్ కలర్స్తో పాస్ అవుతారని కలెక్టర్ తమీమ్ అన్సారియా ప్రోత్సహించారు. SC, ST, BC, మైనారిటీ సంక్షేమ వసతి గృహాల విద్యార్థుల కోసం నిర్వహించిన విజయం మనదే కార్యక్రమంలో పాల్గొని ఆమె మాట్లాడారు. లక్ష్యాలను పెట్టుకుని వాటి విజయానికి కృషి చేయాలని సూచించారు. పరీక్షలపై భయం లేకుండా పాజిటివ్ మైండ్సెట్తో చదవాలని తెలిపారు. విద్యార్థులకు విజయం మనదే స్టడీ మెటీరియల్ ఇచ్చారు.
News January 9, 2026
తెనాలి: రేషన్ బియ్యం అక్రమ రవాణా కేసులో జైలు శిక్ష

తెనాలి (M) నందివెలుగు వద్ద అక్రమంగా రేషన్ బియ్యాన్ని రవాణా చేస్తూ పట్టుబడిన ఫిరంగిపురానికి చెందిన ఉయ్యాల తిరుపతయ్యకు 3 నెలలు జైలు శిక్ష, రూ.5 వేల జరిమానా విధిస్తూ న్యాయమూర్తి పవన్ కుమార్ తీర్పు ఇచ్చారు. 2022లో అప్పటి రూరల్ SI CH వెంకటేశ్వర్లు నిర్వహించిన తనిఖీల్లో నిందితుడు 60 బస్తాల PDS బియ్యంతో పట్టుబడగా, శుక్రవారం కేసు విచారణకు వచ్చింది. APP సునీల్ కుమార్ ప్రాసిక్యూషన్ తరఫున వాదనలు వినిపించారు.


