News March 20, 2024

గుంటూరు జిల్లా పోలీసులకు ముఖ్యమంత్రి శౌర్య పతకాలు

image

ఉగాది పర్వదినం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ శాఖలో ప్రతిభ కనబరిచిన పోలీస్ అధికారులకు, సీఎం శౌర్య పతకం మంగళవారం ఉన్నతాధికారులు ప్రకటించారు. వారిలో గుంటూరు జిల్లా మేడికొండూరు సీఐగా పనిచేసిన కె.వాసును ముఖ్యమంత్రి శౌర్య పతకానికి ఎంపిక చేశారు. ఇంటెలిజెన్స్‌లో ఉన్న ఎస్ఐ మధుసూదన్ రావు, ఆర్‌ఐ వెంకటరమణ, R SI సంపత్ రావు, కానిస్టేబుళ్లు త్రిమూర్తులు, భాస్కరరావులకు ముఖ్యమంత్రి శౌర్య పతకం వరించింది.

Similar News

News September 29, 2024

పల్నాడు: రైలులో భారీ చోరీ

image

హుబ్లీ నుంచి విజయవాడ వస్తున్న రైలులో శనివారం ఉదయం చోరీ జరిగింది. పల్నాడు జిల్లా సత్తెనపల్లికి చెందిన జ్యువెలర్స్ షాపు నిర్వాహకులు రంగారావు, సతీశ్‌లకు చెందిన రూ.2.5 కోట్ల విలువైన 3.5 కిలోల బంగారు ఆభరణాలు చోరీ అయ్యాయి. రైలు నంద్యాల చేరుకున్న అనంతరం తాము నిద్రపోగా చోరీ జరిగిందని, నంద్యాల రైల్వే పోలీసులకు సమాచారం ఇచ్చామని రంగారావు, సతీశ్ తెలిపారు.

News September 29, 2024

హోంమంత్రి అనిత డిక్లరేషన్ ఇచ్చారా.?: అంబటి

image

‘హోంమంత్రి శ్రీమతి అనిత గారు శ్రీవారి దర్శనానికి వెళ్లారు డిక్లరేషన్ ఇచ్చారా? లేదా?’ అని గుంటూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు అంబటి రాంబాబు ట్విట్టర్ వేదికగా ఆమెను ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డి డిక్లరేషన్ ఇచ్చిన తర్వాతే తిరుమల దర్శనానికి వెళ్లాలని హోంమంత్రి అనితతో పాటు పలువురు డిమాండ్ చేస్తున్నారు. దీనిపై అంబటి తనదైన శైలిలో స్పందించారు. డిక్లరేషన్‌పై కొద్ది రోజులుగా చర్చ నడుస్తోన్న విషయం తెలిసిందే.

News September 29, 2024

TDP MLC అభ్యర్థిగా ఆలపాటి రాజేంద్రప్రసాద్.. నేడే అనౌన్స్?

image

ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాల TDP ఎమ్మెల్సీ అభ్యర్థిని నేడు ప్రకటించే అవకాశం ఉంది. మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ పేరు టీడీపీ అధిస్ఠానం ఇప్పటికే ఖరారు చేసిందని సమాచారం. తెనాలి MLA టికెట్ కూటమిలో భాగంగా జనసేనకు వెళ్లింది. దీంతో ఆ సీటును ఆలపాటి త్యాగం చేశారు. అందుకు ఆయనకు ఎమ్మెల్సీ టికెట్ ప్రతిఫలంగా దక్కుతోంది. ఆలపాటి గతంలో మూడు సార్లు MLAగా గెలిచారు. కాగా 1999లో విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు.