News September 12, 2024

గుంటూరు: డిగ్రీ సప్లిమెంటరీ మూల్యాంకనం ప్రారంభం

image

ANU ఐదో సెమిస్టర్ డిగ్రీ సప్లిమెంటరీ పరీక్షల మూల్యాంకనం గుంటూరు మార్కెట్ సెంటర్లోని హిందూ కళాశాలలో ఈనెల 13న ప్రారంభవుతుందని ప్రిన్సిపల్ పి.ఎం.ప్రసాద్ తెలిపారు. వీటితో పాటు 7వ సెమిస్టర్ రెగ్యులర్ పరీక్ష పత్రాల మూల్యాంకనం కూడా జరుగుతుందన్నారు. మూల్యాంకన విధుల్లో పాల్గొనే అధ్యాపకులను విధుల నుంచి రిలీవ్ చేసి పంపాలని ఏఎన్యూ పరిధిలోని డిగ్రీ కళాశాలల ప్రిన్సిపల్స్ ను కోరారు.

Similar News

News February 22, 2026

నేడు గుంటూరుకు CMచంద్రబాబు రాక

image

గ్రామీణ డాక్ సేవక్ సమ్మేళనానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. బొమ్మిడాలనగర్‌లోని సత్యసాయి స్పిరిచ్యువల్ సొసైటీలో ఆదివారం ఈ కార్యక్రమం జరగనుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింథియా, పెమ్మసాని చంద్రశేఖర్ ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఇందులో భాగంగా అతిథులు తపాలా సేవా మూర్తులకు సన్మానం చేయనున్నారు.

News February 22, 2026

ఫిరంగిపురం: కాలువలోకి దూసుకెళ్లిన బైక్.. యువకుడి మృతి

image

ఫిరంగిపురం మండలం గుండాలపాడు గ్రామంలోని రైస్ మిల్లు వద్ద శనివారం విషాదం చోటుచేసుకుంది. బైక్ అదుపుతప్పి కాలువలో పడిపోవడంతో ఓ యువకుడు మరణించాడు. మునగపాడు గ్రామానికి చెందిన యడ్లపల్లి ప్రభుదాసు (24) తన బైక్‌పై వెళ్తుండగా రాత్రి 9.30 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. బైక్ అదుపుతప్పి పక్కనే ఉన్న కాలువలోకి దూసుకెళ్లడంతో ప్రభుదాసు అక్కడికక్కడే మృతి చెందాడు.

News February 22, 2026

ఫిరంగిపురం: కాలువలోకి దూసుకెళ్లిన బైక్.. యువకుడి మృతి

image

ఫిరంగిపురం మండలం గుండాలపాడు గ్రామంలోని రైస్ మిల్లు వద్ద శనివారం విషాదం చోటుచేసుకుంది. బైక్ అదుపుతప్పి కాలువలో పడిపోవడంతో ఓ యువకుడు మరణించాడు. మునగపాడు గ్రామానికి చెందిన యడ్లపల్లి ప్రభుదాసు (24) తన బైక్‌పై వెళ్తుండగా రాత్రి 9.30 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. బైక్ అదుపుతప్పి పక్కనే ఉన్న కాలువలోకి దూసుకెళ్లడంతో ప్రభుదాసు అక్కడికక్కడే మృతి చెందాడు.