News July 4, 2024
గుంటూరు: నేడు విద్యాసంస్థల బంద్కు SFI పిలుపు

గుంటూరు నగరంలోని విద్యాసంస్థలను గురువారం మూసివేయాలని బంద్కు పిలుపు ఇచ్చినట్లు స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జిల్లా కార్యదర్శి ఎం కిరణ్ బుధవారం తెలిపారు. దేశవ్యాప్తంగా విద్యా సంస్థల బంద్లో భాగంగా.. ఈ బంద్ను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నీట్ పరీక్షలో జరిగిన అవకతవకలపై సమగ్ర విచారణ కోరుతూ.. ఈ బంద్ చేపట్టినట్లు SFI నాయకులు తెలిపారు.
Similar News
News February 19, 2026
GNT: నిధుల వినియోగంపై ఆంక్షలు.. సర్పంచుల ఆవేదన

ఏప్రిల్ 2తో సర్పంచుల పదవీకాలం ముగియనున్న వేళ గ్రామాల్లో పనుల బిల్లులపై అనిశ్చితి నెలకొంది. ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఆర్థిక సంఘం నిధులు సుమారు రూ.70 కోట్లు ఉన్నా వాటిని విద్యుత్ బిల్లులు, చెత్త నిర్వహణకే పరిమితం చేశారు. దీంతో అభివృద్ధి పనులు నిలిచిపోయాయని సర్పంచులు అంటున్నారు. ఇప్పటికే చేసిన పనుల బిల్లులు పెండింగ్లో ఉండటంతో కాంట్రాక్టర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆంక్షలు సడలించాలని అంటున్నారు.
News February 19, 2026
నేడు మంగళగిరిలో పర్యటించనున్న జిల్లా కలెక్టర్

గుంటూరు కలెక్టర్ తమీమ్ అన్సారియా గురువారం మంగళగిరిలోని తాడేపల్లి నగరపాలక సంస్థలో పర్యటించనున్నారు. పార్కులు, మోడల్ టాయిలెట్స్, జంక్షన్ల అభివృద్ధి పనులను పరిశీలించనునట్లు అధికారులు తెలిపారు. ఉదయం 9 గంటలకు కాజలోని యానిమల్ బర్త్ కంట్రోల్ సెంటర్ను సందర్శిస్తారు. ఆయా పనుల పరిశీలన అనంతరం 11 గంటలకు MTMC కార్యాలయంలో జరిగే నియోజకవర్గ సమీక్షలో పాల్గొననున్నట్లు ఆమె కార్యాలయ సిబ్బంది తెలిపారు.
News February 19, 2026
అమరావతిలో దసపల్లా హోటల్ పనులు షురూ

అమరావతిలో దసపల్లా 4-స్టార్ హోటల్ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. ఇందులో లగ్జరీ గదులు, సూట్స్, ప్రీమియం సర్వీస్ అపార్ట్మెంట్లు అందుబాటులో ఉంటాయి. రెస్టారెంట్లు, కన్వెన్షన్ సెంటర్, కాన్ఫరెన్స్ హాల్ను ఏర్పాటు చేస్తున్నారు. స్విమ్మింగ్ పూల్, వెల్నెస్ సెంటర్, హెల్త్ క్లబ్ వంటి అత్యాధునిక సౌకర్యాలతో ఈ హోటల్ రూపుదిద్దుకుంటోంది. రాజధానిలో ఆతిథ్య రంగానికి ఇది మరింత ఊతమివ్వనుంది.


