News March 29, 2025
గుంటూరు: పార్ట్ టైమ్ జాబ్ ఆఫర్ల పేరుతో మోసాలు జాగ్రత్త: ఎస్పీ

పార్ట్ టైమ్ జాబ్ ఆఫర్ల పేరుతో సోషల్ మీడియాలో వస్తున్న ప్రకటనల పట్ల గుంటూరు జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ సతీశ్ కుమార్ ఒక ప్రకటనలో హెచ్చరించారు. లైక్, షేర్ చేస్తే రివ్యూలు ఇస్తే డబ్బులు చెల్లిస్తామని మాయమాటలు చెప్పి మోసాలకు పాల్పడుతారని జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. సైబర్ నేరాల బారిన పడితే బాధిత ప్రజలు వెంటనే డయల్ 1930కి ఫోన్ చేసి సమాచారం అందించాలన్నారు.
Similar News
News January 1, 2026
GNT: అల్లర్లు లేవు.. పోలీసుల పక్కా ప్లాన్ సక్సెస్.!

నూతన సంవత్సర వేడుకలతో గుంటూరు జిల్లా సందడిగా మారింది. పూలబొకేలు, స్వీట్స్, కేకుల విక్రయాలు జోరుగా సాగాయి. ఇళ్ల ముందు రంగురంగుల రంగవల్లులతో మహిళలు, యువతులు సందడి చేశారు. అర్ధరాత్రి నుంచే యువత శుభాకాంక్షలు చెప్పుకుంటూ ఉత్సాహంగా పాల్గొన్నారు. కాగా యువత కొద్దిగా ఇంటికే పరిమితమయ్యారు. ఎస్పీ ఆదేశాల మేరకు శాంతియుత వాతావరణంలో వేడుకలు జరిగేలా గుంటూరు జిల్లా పోలీసుల చర్యలు ప్రశంసలు అందుకుంటున్నాయి.
News January 1, 2026
GNT: అల్లర్లు లేవు.. పోలీసుల పక్కా ప్లాన్ సక్సెస్.!

నూతన సంవత్సర వేడుకలతో గుంటూరు జిల్లా సందడిగా మారింది. పూలబొకేలు, స్వీట్స్, కేకుల విక్రయాలు జోరుగా సాగాయి. ఇళ్ల ముందు రంగురంగుల రంగవల్లులతో మహిళలు, యువతులు సందడి చేశారు. అర్ధరాత్రి నుంచే యువత శుభాకాంక్షలు చెప్పుకుంటూ ఉత్సాహంగా పాల్గొన్నారు. కాగా యువత కొద్దిగా ఇంటికే పరిమితమయ్యారు. ఎస్పీ ఆదేశాల మేరకు శాంతియుత వాతావరణంలో వేడుకలు జరిగేలా గుంటూరు జిల్లా పోలీసుల చర్యలు ప్రశంసలు అందుకుంటున్నాయి.
News December 31, 2025
GNT: SC, ST విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యుడిగా కంతేటి

గుంటూరు జిల్లా SC,ST విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యుడిగా కంతేటి బ్రహ్మయ్యను ఎంపిక చేశారు. ఈ మేరకు గుంటూరు జిల్లా కమిటీకి సభ్యుడుగా నియమించిన గుంటూరు కలెక్టర్ తమీమ్ అన్సారీయాకు బ్రహ్మయ్య కృతజ్ఞతలు తెలిపారు. ఎస్సీ, ఎస్టీల రక్షణ కోసం 1989లో ఏర్పాటు చేసిన చట్టాన్ని ఎవరైనా దుర్వినియోగపరిస్తే అలాంటి వారిపై చర్యలు తీసుకునేందుకు తన వంతు కృషి చేస్తానని వెల్లడించారు.


