News June 29, 2024
గుంటూరు: పోలీస్ గ్రీవెన్స్ డే నిర్వహించిన ఎస్పీ
గుంటూరు జిల్లా పోలీస్ కార్యాలయంలో శుక్రవారం ఎస్పీ తుషార్ డూడి పోలీస్ గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా సిబ్బంది తమ సమస్యలను ఎస్పీ దృష్టికి తీసుకెళ్లారు. సిబ్బంది తమ అనారోగ్య సమస్యలను వ్యక్తిగత సమస్యలను ఎస్పీకి వివరించగా సిబ్బంది సమస్యలను పరిగణలోకి తీసుకొని, వారికి సాధ్యమైనంత మేర సమస్యల పరిష్కరించడానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
Similar News
News July 1, 2024
మద్యం నిల్వ కేసు.. వైసీపీ MLA అభ్యర్థిని తండ్రి అరెస్ట్
మద్యం నిల్వ చేసిన కేసులో మంగళగిరి YCP అభ్యర్థినిగా పోటీ చేసిన మురుగుడు లావణ్య తండ్రి, వైసీపీ నాయకుడు కాండ్రు శివనాగేంద్రంను అరెస్టు చేసినట్లు సెబ్ సీఐ ప్రసన్న ఆదివారం తెలిపారు. మంగళగిరిలోని కాండ్రు వారి వీధిలో దామర్ల వీరాంజనేయులు నివాసంలో జూన్ 1న 6,528 మద్యం సీసాలను నిల్వ చేశారు. దీంతో పోలీసులు శివనాగేంద్రంను శనివారం అరెస్టు చేసి మంగళగిరి కోర్టులో హాజరుపరచగా 15 రోజుల రిమాండ్ విధించింది.
News July 1, 2024
గుంటూరు-ఔరంగాబాద్ రైలు ప్రారంభం
ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని గుంటూరు- ఔరంగాబాద్-గుంటూరు మధ్య నూతనంగా ప్రారంభించిన రైలు ఆదివారం అధికారులు ప్రారంభించారు. ఈ రైలు (17253) ప్రతిరోజు గుంటూరులో 07.10 గంటలకు బయలుదేరి మరుసటిరోజు ఔరంగాబాద్ 13. 20 గంటలకు చేరుతుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు(17254) ఔరంగాబాద్ లో 16.15 గంటలకు ప్రారంభమై గుంటూరు మరుసటిరోజు 21.30 గంటలకు చేరుతుంది.
News July 1, 2024
MP లావు కృష్ణ దేవరాయలు నేటి పర్యటన వివరాలు
నరసరావుపేట పార్లమెంట్ సభ్యుడు లావు శ్రీ కృష్ణ దేవరాయలు పర్యటన వివరాలను ఆయన కార్యాలయ సిబ్బంది తెలియజేశారు. నేటి నుంచి పార్లమెంట్ సమావేశాలు ఉన్నందున నరసరావుపేట ఎంపీ, టీడీపీ పార్లమెంటరీ పార్టీనేత లావు శ్రీ కృష్ణదేవరాయలు ఢిల్లీ వెళ్తున్నారన్నారు. సోమవారం నుంచి గురువారం వరకు MP లావు అందుబాటులో ఉండరని పార్లమెంటు పరిధిలోని ప్రజలందరూ గమనించవలసిందిగా తెలిపారు.