News July 7, 2025
గుంటూరు మిర్చి యార్డులో నేటి ధరలివే.!

గుంటూరు మిరప మార్కెట్లో సోమవారం 20 వేల బస్తాలు అమ్మకానికి వచ్చాయి. ఏ/సీ సరుకు సంఖ్య 60 వేలుగా నమోదైంది. తాజా ధరల ప్రకారం తేజా ఏ/సి రూ.120-132, 355 ఏ/సి రూ.100-125, 2043 ఏ/సి రూ.120-130, 341 ఏ/సి రూ.120-135, నంబర్ 5 ఏ/సి రూ.125-135 ఉండగా, సీజెంటా, డీడీ, రోమి-26, బంగారం రకాల ధరలు కూడా స్థిరంగా ఉన్నాయి. నాటు 334, సూపర్ టెన్ రకాలు రూ.80-130 వరకు ఉన్నాయి. తాలుకూ ధరలు రూ.35-70 మధ్య ఉన్నాయి.
Similar News
News July 7, 2025
అందుకే ఇన్నింగ్స్ డిక్లేర్ చేశా: ముల్డర్

జింబాబ్వేతో జరుగుతున్న రెండో టెస్టులో 400 కొట్టి లారా రికార్డును బ్రేక్ చేసే అవకాశం ఉన్నా SA కెప్టెన్ ముల్డర్(367*) ఇన్నింగ్స్ డిక్లేర్ చేసిన విషయం తెలిసిందే. దాని వెనుకున్న కారణాన్ని ఆయన బయటపెట్టారు. ‘గెలవడానికి సరిపడా స్కోర్ చేశామని భావించాం. లారా ఒక లెజెండ్. ఆ రికార్డు అలాగే ఉండేందుకు ఆయన అర్హులు. మళ్లీ ఛాన్స్ వచ్చినా ఇదే నిర్ణయం తీసుకుంటా. కోచ్ శుక్రీ కూడా ఇదే అన్నారు’ అని వ్యాఖ్యానించారు.
News July 7, 2025
మెదక్: ‘రైతులను ఆదుకోవాలి’

రాష్ట్ర ప్రభుత్వం ఫసల్ బీమా పథకాన్ని అమలు చేసి రైతులకు న్యాయం చేయాలని రైతు రక్షణ సమితి సభ్యులు డిమాండ్ చేశారు. సోమవారం మెదక్ కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ రాహుల్ రాజ్కు రైతు సమస్యలపై రైతు రక్షణ సమితి సభ్యులు వినతిపత్రం అందించారు. అతివృష్టి, అనావృష్టితో రైతులు నష్టపోతున్నారని, ఫసల్ బీమా పథకాన్ని అమలు చేసి రైతులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.
News July 7, 2025
విశాఖ నుంచి బయలుదేరే పలు రైళ్లు రద్దు

కోటబొమ్మాలి రైల్వే లైన్లో ఇంటర్ లాకింగ్ పనులు నేపథ్యంలో విశాఖ నుంచి బయలుదేరే పలు రైలు రద్దు చేసినట్లు వాల్తే డివిజన్ డీసీఎం సందీప్ సోమవారం తెలిపారు. విశాఖ -గుణుపూర్ (58505/06), విశాఖ -బరంపూర్ (58531/32), విశాఖ -భువనేశ్వర్ ఇంటర్ సిటీ (22819/20), విశాఖ- పలాస ప్యాసింజర్ (67289/90), విశాఖ -బరంపూర్ ఎక్స్ప్రెస్ (18525/26) రైళ్ళు జూలై 11న రద్దు చేసినట్లు పేర్కొన్నారు. ప్రయాణికులు గమనించాలని సూచించారు.