News October 9, 2025
గుంటూరు మిర్చి యార్డులో నేటి ధరలివే.!

గుంటూరు మిర్చి యార్డుకు గురువారం మొత్తం 75,000 బస్తాల A/C సరకు వచ్చింది. మార్కెట్లో ధరలు స్థిరంగా ఉన్నా, కొన్ని రకాల ధరలు ఆకర్షణీయంగా పలికాయి. పసుపు రకం మిర్చి ధర కిలోకు ₹200 నుంచి ₹250 వరకు అత్యధికంగా నమోదైంది. తేజా A/C రకం ధర కిలోకు ₹100 నుంచి ₹152 వరకు పలికింది. 341 A/C రకం గరిష్ఠంగా ₹165కి చేరుకుంది. నాటు రకాలైన 334, సూపర్ టెన్ రకాలు కిలోకు ₹90 నుంచి ₹155 వరకు ట్రేడ్ అయ్యాయి.
Similar News
News October 9, 2025
ధాన్యం కొనుగోళ్లలో దళారీ వ్యవస్థను కట్టడి చేయాలి: జేసీ

GNT జిల్లాలో ధాన్యం సేకరణపై నేడు కలెక్టరేట్లో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో JC ఆశుతోష్ శ్రీవాస్తవ మాట్లాడారు. ధాన్యం కొనుగోళ్లలో దళారీ వ్యవస్థను పూర్తిగా కట్టడి చేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో 50 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణను లక్ష్యంగా నిర్దేశించినట్లు తెలిపారు. ధాన్యం కనీస మద్దతు ధరను సాధారణ రకం క్వింటాలుకు రూ. 2,369/గా, ‘A’ గ్రేడ్ రకం క్వింటాలుకు రూ. 2,389/గా నిర్ణయించామన్నారు.
News October 9, 2025
తెనాలి: ‘మావు’లకు కేరాఫ్ అడ్రస్ ఆ ఊరు.!

కాలువల్లో చేపల వేటకు ఉపయోగించే వెదురు ‘చేపల మావుల’ తయారీలో తెనాలి సమీప ఆలపాడు ప్రసిద్ధి చెందింది. రాష్ట్ర వ్యాప్తంగా చేపలు పట్టుకొని వ్యాపారం చేసుకునే ప్రతి ఒక్కరికి చేపల మావులు అనగానే ముందుగా గుర్తొచ్చేది చుండూరు మండలం ఆలపాడు గ్రామమే. నాణ్యమైన మన్నికైన చేపల మావులు కోసం అనేక మంది ఇక్కడకు వచ్చి కొనుగోలు చేసుకు వెళుతుంటారు. ఇక్కడ చాలా కుటుంబాలు వ్యవసాయ పనులతో పాటు వీటి తయారీ వృత్తిపైనే ఆధారపడ్డాయి.
News October 9, 2025
బాణాసంచా విక్రయాలకు పర్మిషన్ తీసుకోవాలి: కలెక్టర్

దీపావళి పండగకు బాణాసంచా విక్రయించే షాపుల అనుమతులకు అక్టోబర్ 17 లోగా దరఖాస్తులు సమర్పించాలని కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా తెలిపారు. ఈ మేరకు గురువారం ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. అక్టోబర్ 20న దీపావళి పండగ సందర్భంగా తాత్కాలిక షాపులు పెట్టుకొనుటకు ఖాళీ ప్రదేశాలను గుర్తించాలని అధికారులను ఆదేశించడం జరిగిందన్నారు. అనుమతులు లేకుండా టపాసులు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.