News April 24, 2025
గుంటూరు మిర్చి యార్డ్లో నేటి ధరలు

గుంటూరు మిర్చి మార్కెట్ యార్డుకు గురువారం 90,000 బస్తాలు చేరుకున్నాయి. ఈ మిర్చి ధరలు నాణ్యతను బట్టి భిన్నంగా ఉన్నాయి. 334 రకాల్లో సూపర్ 10 రేట్లు ఇలా ఉన్నాయి. దేశవాళీ రూ.6,000-10,000, డీలక్స్ రూ.10,000-11,000, మద్రాస్ క్వాలిటీ రూ.11,000 పైన ఉన్నాయి. తేజ రకం రెండో కోత (కందుకూరు, పొదిలి) రూ.12,500-రూ.13,000 వరకు పలికింది. 341 రకాలు రూ.7,500-12,000, నంబర్ ఫైవ్ రూ.7,500-రూ.11,000 వరకు ధరలు ఉన్నాయి.
Similar News
News September 10, 2025
గుంటూరు రైల్వే డివిజన్ పరిధిలో స్టాపులు పునరుద్ధరణ

గుంటూరు రైల్వే డివిజన్ పరిధిలోని దొనకొండ, పిడుగురాళ్ల, కురిచేడు రైల్వే స్టేషన్లలో గతంలో రద్దు చేసిన రైళ్ల నిలుపుదలలను మళ్లీ పునరుద్ధరించినట్లు గుంటూరు రైల్వే డివిజన్ అధికారులు తెలిపారు. ఈ మార్పులు నేటి నుంచి అమల్లోకి రానున్నాయని, ప్రయాణికుల సౌకర్యార్థం కొత్త సమయపట్టిక ప్రకారం అన్ని రైళ్లు ఆగనున్నాయని అధికారులు వెల్లడించారు.
News September 10, 2025
నేడు ఉండ్రాళ్ళ తద్ది.. విశిష్టత తెలుసా

ఉండ్రాళ్ళ తద్ది నోమును భాద్రపద బహుళ తదియ రోజున స్త్రీలు ఆచరిస్తారు. దీని విశిష్టత ఏమంటే, ఈ నోమును పాటిస్తే పెళ్లికాని అమ్మాయిలకు మంచి భర్త లభిస్తాడని, వివాహితులు సుమంగళిగా ఉంటారని నమ్మకం. ఈ నోములో ఉండ్రాళ్ళను నైవేద్యంగా పెడతారు, కాబట్టి దీనికి ఉండ్రాళ్ల తద్ది అనే పేరు వచ్చింది. ఐదు సంవత్సరాలు ఈ నోమును ఆచరించి, ఉద్యాపన చేసేటప్పుడు వాయనంతో పాటు చీర, రవికలను కూడా సమర్పిస్తారు.
News September 10, 2025
ఆనాటి హాస్యనటుడు పి.ఎల్. నారాయణ మన బాపట్ల వాసే

విలక్షణమైన నటుడు, రచయిత, నాటక ప్రయోక్త పి.ఎల్. నారాయణగా పేరుపొందిన పుదుక్కోటై లక్ష్మీనారాయణ (సెప్టెంబర్ 10, 1935 – నవంబరు 3, 1998) ఉమ్మడి గుంటూరు జిల్లా బాపట్లలో జన్మించారు. ఈయన ఎక్కువగా సహాయ పాత్రలు, హాస్య ప్రధానమైన పాత్రలు పోషించారు. 1992లో యజ్ఞం సినిమాలో నటనకు గాను ఉత్తమ సహాయనటుడిగా జాతీయ పురస్కారం అందుకున్నారు. కుక్క, నేటి భారతం, మయూరి, రేపటి పౌరులు సినిమాలకు నంది అవార్డు అందుకున్నారు.