News February 28, 2025

గుంటూరు: మైనర్ బాలికపై అత్యాచారం

image

ఉమ్మడి గుంటూరు (D) నగరం మండలంలో దారుణం జరిగింది. ఓ మైనర్ బాలికపై 17ఏళ్ల బాలుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. నగరం ఎస్ఐ బండ్ల భార్గవ్ వివరాల ప్రకారం.. ఈనెల 25న ఇంటి ముందు ఆడుకుంటున్న చిన్నారిని బలవంతంగా దగ్గరలో ఉన్న స్కూల్ బస్సులోకి లాక్కొని వెళ్లి అత్యాచారానికి పాల్పడినట్లు తెలిపారు. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు అతడిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు.

Similar News

News February 28, 2025

ఎక్కువ పని గంటలు ప్రాణానికి ముప్పు!

image

కెరీర్‌లో మరింత రాణించాలంటే ఎక్కువ గంటలు పనిచేయాలి అనుకునే వారికి డా. సుధీర్ కుమార్ పలు సూచనలు చేశారు. ‘కెరీర్ గ్రోత్ కోసం రోజుకు 15 గంటలు పని చేయొచ్చా అని ఓ 25 ఏళ్ల ఉద్యోగి అడిగితే ఇలా చేస్తే మీరు రాణించలేరని చెప్పా. తెలివిగా, ఎక్కువ ఉత్పాదకతతో పనిచేయడం మంచిది. అతిగా పనిచేయడం వల్ల గుండెపోటు, పక్షవాతంతో పాటు అకాల మరణం సంభవించే ప్రమాదం ఉంది. ఒత్తిడితో పాటు నిరాశకు గురవుతారు’ అని ఆయన ట్వీట్ చేశారు.

News February 28, 2025

కామారెడ్డి ఎస్పీ ఎదుట లొంగిపోయిన మావోయిస్టులు

image

కామారెడ్డి ఎస్పీ సింధు శర్మ ఎదుట ఇద్దరు మావోయిస్టులు శుక్రవారం లొంగిపోయారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వాసి గుర్రాల విజయ్ కుమార్ (36), ఛత్తీస్‌గఢ్ బీజాపూర్‌కి చెందిన సోడి బాలకృష్ణ ఎస్పీ ఎదుట లొంగిపోయారు. విజయ్.. హిడ్మా నాయకత్వంలోని CPI Maoist PLGA 1st బెటాలియన్‌లో 2022లో పార్టీ మెంబర్‌గా చేరారు. సోడి బాలకృష్ణ 2018లో చర్ల ఏరియా కమిటీ మలేషియా మెంబర్‌గా అరుణ్ DVC ఆధ్వర్యంలో చేరారు.

News February 28, 2025

వన దుర్గమ్మ ప్రత్యేక అలంకరణ

image

మెదక్ జిల్లాలో అతి పవిత్రమైన పుణ్యక్షేత్రం ఏడుపాయల దేవస్థానం. మహాశివరాత్రి పురస్కరించుకుని నేడు రథోత్సవం సందర్భంగా అమ్మవారిని వేకువజామున మంజీరా నీళ్లతో అభిషేకం చేసి వివిధ రకాల పువ్వులు, పట్టు వస్త్రాలు, పసుపు కుంకుమతో అర్చకులు విశేష అలంకరణ చేశారు. తథానంతరం భక్తులకు దర్శనం కల్పించారు. వివిధ జిల్లాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు.

error: Content is protected !!