News July 6, 2024
గుంటూరు రేంజ్ ఐజీని కలిసిన టీడీపీ ఎమ్మెల్యేలు

గుంటూరు రేంజ్ ఐజీ కార్యాలయంలో శుక్రవారం ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి (IPS)ని ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పుష్పగుచ్ఛాన్ని అందజేసి శాలువతో సత్కరించారు. లా అండ్ ఆర్డర్ పైన ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరారు. వీళ్లతో పాటు ఒంగోలు పార్లమెంట్ జనసేన అధ్యక్షుడు రియాజ్ ఉన్నారు.
Similar News
News December 17, 2025
ప్రకాశంలో రెడ్డి వర్సెస్ రెడ్డి.. పీక్స్ లోకి పాలి’ ట్రిక్స్’..!

ప్రకాశం రాజకీయం రసవత్తరంగా మారింది. జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా ఎమ్మెల్యే ఉగ్ర పేరు ఖరారైనట్లు ప్రచారం సాగుతోంది. జిల్లా అధ్యక్ష పదవి భర్తీ చేసి, పార్టీని మరింత బలోపేతం చేయాలన్నది అధిష్టానం అభిమతం. ఇప్పటికే వైసీపీ జిల్లా అధ్యక్ష పదవిలో దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి కొనసాగుతున్నారు. టీడీపీ ఉగ్ర పేరు దాదాపు ఖరారు చేయగా, ప్రకాశం రాజకీయం రెడ్డి వర్సెస్ రెడ్డి అంటూ జోరుగా చర్చ సాగుతోంది.
News December 17, 2025
టంగుటూరు వద్ద తెల్లవారుజామున ఘోర ప్రమాదం.. ఒకరు స్పాట్ డెడ్

టంగుటూరులోని టోల్ ప్లాజాకు సమీపంలో గుర్తుతెలియని వాహనం ఢీకొని ఒకరు మృతి చెందిన ఘటన బుధవారం తెల్లవారుజామున జరిగింది. టోల్ ప్లాజాకు సమీపంలోకి బైక్ రాగానే, అటువైపుగా వస్తున్న గుర్తుతెలియని వాహనం వెనుక నుంచి ఢీకొంది. ఈ ప్రమాదంలో బైక్పై ఉన్న వ్యక్తి రహదారిపై బలంగా పడి అక్కడికక్కడే మృతి చెందారు. మృతుని వివరాలను పోలీసులు ఆరా తీస్తున్నారు.
News December 17, 2025
గిద్దలూరు: దిగువ మెట్ట అటవీ ప్రాంతంలో లారీ ప్రమాదం..

గిద్దలూరు మండలం దిగువమెట్ట సమీపంలోని నల్లమల అటవీ ప్రాంతం ఎస్–టర్నింగ్ వద్ద లారీ ప్రమాదం జరిగింది. మార్కాపురం నుంచి బళ్లారి వెళ్తున్న పత్తి లోడ్ మినీ లారీ అదుపుతప్పి కింద పడింది. డ్రైవర్కు ఎటువంటి గాయాలు కాలేదు.


