News March 25, 2024
గుంటూరు: విద్యాహక్కు చట్టం ప్రవేశాలకు గడువు పొడిగింపు

విద్యాహక్కుచట్టం-2009 ద్వారా 2024-25 విద్యా సంవత్సరానికి ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల్లో ఒకటో తరగతిలో 25 శాతం సీట్లలో ఉచితంగా ప్రవేశం పొందటానికి ఆన్లైన్ దరఖాస్తు గడువును ప్రభుత్వం ఈనెల 31 వరకు పొడిగించినట్లు డీఈవో శైలజ ఆదివారం తెలిపారు. అధిక సంఖ్యలో విద్యార్థులకు అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం గడువును పొడిగించిందన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
Similar News
News February 12, 2026
తాడేపల్లి: మంత్రి లోకేశ్ను కలిసిన బండ్ల గణేశ్

సినీ నిర్మాత బండ్ల గణేశ్ గురువారం తాడేపల్లి పరిధి ఉండవల్లి నివాసంలో మంత్రి లోకేశ్ను గురువారం కలిశారు. పాదయాత్ర సాగిన తీరును మంత్రి అడిగి తెలుసుకొని, శ్రీవారి ప్రసాదం స్వీకరించారు. YCP హయాంలో చంద్రబాబు అక్రమంగా అరెస్ట్ కావడంతో.. ఆయన విడుదలను కాంక్షిస్తూ షాద్ నగర్ నుంచి తిరుమలకు పాదయాత్రగా వస్తానని గణేశ్ మొక్కుకున్నారు. కాగా 23 రోజుల పాటు పాదయాత్ర చేసి శ్రీవారి మొక్కు చెల్లించుకున్నారు.
News February 12, 2026
GNT: 21న జిల్లా పరిషత్ సర్వ సభ్య సమావేశం

గుంటూరు జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం ఈ నెల 21వ తేదీన నిర్వహించనున్నట్లు జడ్పీ సీఈఓ వి.జ్యోతి బసు వెల్లడించారు. జడ్పీ ఛైర్పర్సన్ అధ్యక్షతన ఉదయం 11 గంటలకు జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఈ భేటీ ప్రారంభం కానుంది. ఈ మేరకు గురువారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. జిల్లాలోని ప్రజాప్రతినిధులు, అధికారులు, సభ్యులందరూ సకాలంలో హాజరై సమావేశాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు.
News February 12, 2026
వెలగపూడి: అసెంబ్లీ బందోబస్తు పరిశీలించిన ఎస్పీ

వెలగపూడి అసెంబ్లీ వద్ద బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో ఏర్పాటు చేసిన బందోబస్తును గుంటూరు ఎస్పీ వకుల్ జిందాల్ గురువారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. విధులు నిర్వహిస్తున్న పోలీసు అధికారులు సిబ్బంది అప్రమత్తత తనిఖీల విధానం పనితీరును సమగ్రంగా పరిశీలించారు. ఏమైనా అనుమానాస్పద వాహనాలు, వ్యక్తులు గుర్తించినట్లయితే వెంటనే పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్కు సమాచారం ఇవ్వాలని సూచించారు.


