News March 27, 2025

గుంటూరు: సీఎం చంద్రబాబుకు నాదెండ్ల స్వాగతం

image

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను గురువారం పరిశీలన చేశారు. ఈ నేపథ్యంలో మంత్రి శ్రీ నాదెండ్ల మనోహర్ పోలవరం చేరుకుని ముఖ్యమంత్రికి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి మంత్రి నాదెండ్ల ప్రాజెక్టు గురించి పలు విషయాలు వివరించారు. అనంతరం నిర్వాశితులతో ముఖ్యమంత్రి చంద్రబాబు ముఖాముఖి నిర్వహించారు.

Similar News

News March 31, 2025

గుంటూరు జిల్లా కలెక్టర్ ముఖ్య సూచనలు

image

రంజాన్ పండుగ సందర్భంగా ప్రభుత్వ సెలవు కావడంతో సోమవారం గుంటూరు కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార (PGRS) కార్యక్రమం తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి తెలిపారు. ఈ మేరకు ఆమె ఓ ప్రకటన విడుదల చేశారు. కావున జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అర్జీలు ఇవ్వదలచుకున్న ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.

News March 30, 2025

తుళ్లూరు: నేడే పీ-4 కార్యక్రమం ప్రారంభం 

image

ఏపీలో పేదరికం లేని రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ఆదివారం సాయంత్రం 4 గంటలకు పీ-4 కార్యక్రమం ప్రారంభించనుంది. వెలగపూడి సచివాలయంలో సీఎం చంద్రబాబు ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. 20 శాతం మంది నిరుపేదలకు ఉన్నత స్థితిలో ఉన్న 10 శాతం మంది సహాయం చేసేందుకే దీనిని చేపట్టనున్నారు. కార్యక్రమంలో దాదాపు 14వేల మంది పాల్గొంటారు. పేదలు, దాతలు, మంత్రులు, ప్రముఖులు హాజరయ్యేందుకు ఏర్పాట్లు జరిగాయి. 

News March 30, 2025

వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఉగాది వేడుకలు

image

తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆదివానం ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. తొలుత శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి, పంచాంగ శ్రవణం చేశారు. రాష్ట్రంలో ప్రజలందరికీ మేలు జరగాలని ఆకాంక్షించినట్లు మాజీ మంత్రి అంబటి రాంబాబు తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు, దొంతిరెడ్డి వేమారెడ్డి, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, పలువురు రాష్ట్ర వైసీపీ నాయకులు పాల్గొన్నారు. 

error: Content is protected !!