News February 25, 2026
గుంటూరు: ‘27న సత్యం, న్యాయాన్ని సమాధి చేస్తున్నారు’

తెనాలికి చెందిన బీఫార్మసీ విద్యార్థిని ఆయేషా మీరా హత్య కేసును సీబీఐ క్లోజ్ చేసిన విషయం తెలిసిందే. దీనిపై ఆయేషా తల్లిదండ్రులు శంషాబాద్ బేగం, ఇక్బాల్ బాషా స్పందించారు. ఆయేషా మీరా శరీర అవశేషాలను ఈనెల 27న తిరిగి ఖననం చేయనున్నట్లు తెలిపారు. 18 ఏళ్లుగా పోరాడుతున్నప్పటికి తమ బిడ్డకు న్యాయం జరగలేదన్నారు. సత్యం, న్యాయం, ధర్మాన్ని 27న సమాధి చేస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
Similar News
News February 25, 2026
చెరకు పంటలో పీక, కాండం తొలుచు పురుగు ప్రభావం

చెరకు నాటిన దగ్గరి నుంచి నరికే వరకు ఈ పురుగులు పైరును ఆశిస్తాయి. బాల్య దశలో పీకపురుగుగా, కాండం ఏర్పడిన తర్వాత కాండం తొలుచు పురుగుగా పంటను నష్టపరుస్తుంది. పీక పురుగు తాకిడి వర్షాధార చెరకుపై ఎక్కువగా ఉంటుంది. దీని ఉద్ధృతి ఎక్కువైతే పంటకు తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉంటుంది. అందుకే ఈ పురుగుల విషయంలో నిర్లక్ష్యం వద్దని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు.
News February 25, 2026
పార్వతీ దేవి అన్నపూర్ణగా ఎలా మారింది?

లోకానికి ఆహారం అందించే దేవత అన్నపూర్ణ దేవి. ఓసారి శివుడు ‘ఆహారం ఓ భ్రమ’ అన్నాడు. దీంతో కోపగించిన పార్వతీదేవి కాశీకి వెళ్లింది. దీంతో సకల జీవరాశులు ఆకలితో అలమటించాయి. అప్పుడు ఆహారం ప్రాముఖ్యం అర్థమైన శివుడు కాశీకి వెళ్లి అమ్మవారిని భిక్ష అడుగుతాడు. పరమేశ్వరుడికే అన్నం పెట్టడంతో ఆ తల్లి ‘అన్నపూర్ణ’గా ప్రసిద్ధి చెందింది. ఆకలితో ఉన్నవారికి అన్నదానం చేయడం వల్ల ఆ తల్లి అనుగ్రహం లభిస్తుందని నమ్మకం.
News February 25, 2026
607 పోస్టులు.. దరఖాస్తుకు ఇవాళే లాస్ట్ డేట్

నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్ ఇండియా లిమిటెడ్(NLCIL)లో 607 ట్రేడ్ అప్రెంటిస్ పోస్టులకు అప్లై చేయడానికి గడువు నేటితో ముగియనుంది. ఐటీఐ అర్హత గల వారు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల కనీస వయసు 18 ఏళ్లు నిండి ఉండాలి. షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ, మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. నెలకు రూ.11,040 చెల్లిస్తారు. వెబ్సైట్: https://www.nlcindia.in


