News May 9, 2024
గుంటూరు: 372 క్రిటికల్ పోలింగ్ కేంద్రాల్లో మైక్రో అబ్జర్వర్లు

జిల్లాలో ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేపట్టామని కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. గురువారం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేశ్ కుమార్ మీనా వీడియో కాన్ఫరెన్స్ సమావేశంలో కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. జిల్లాలో 372 క్రిటికల్ పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్ట్తో పాటు మైక్రో అబ్జర్వర్లను నియమిస్తున్నామన్నారు. జిల్లాలో 68 శాతం పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేశామన్నారు.
Similar News
News April 22, 2025
దొంగల కదలికల భయంతో నిద్రలేని గ్రామం

పెదనందిపాడు మండలానికి చెందిన పరిటలవారిపాలెం గ్రామంలో రెండు రోజులుగా దొంగల కదలికలతో గ్రామస్థులు భయంతో గడుపుతున్నారు. రాత్రివేళల్లో ఇంట్లోకి చొరబడి దొంగిలించేందుకు దొంగలు ప్రయత్నించినట్లు స్థానికులు తెలిపారు. అనుమానాస్పద వ్యక్తులను గుర్తించడానికి గ్రామస్థులు కర్రలు పట్టుకుని రాత్రి వేళ కాపలా కాశారు. పోలీసుల గ్రామానికి భద్రత కల్పించాలని వారు కోరుతున్నారు.
News April 22, 2025
అమరావతిలో ప్రధాని మోదీ పర్యటనపై సమీక్ష

వచ్చే నెల 2న అమరావతిలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించనున్నారు. ఈ మేరకు.. సోమవారం ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘం సమావేశాన్ని నిర్వహించింది. ఈ సమావేశంలో మంత్రులు నాదెండ్ల మనోహర్, పయ్యావుల కేశవ్, పొంగూరు నారాయణ పాల్గొన్నారు. పర్యటనకు సంబంధించి హెలిప్యాడ్లు, బహిరంగ సభ ప్రాంగణం, రహదారి అభివృద్ధి, భద్రత ఏర్పాట్లపై సమీక్ష చేశారు. ప్రధాని బహిరంగ సభకు సుమారు 5 లక్షల మంది హాజరయ్యే అవకాశముందని అంచనా వేశారు.
News April 22, 2025
గుంటూరు జిల్లాలో తీవ్ర ఉత్కంఠ

రేపు టెన్త్ ఫలితాలు విడుదల కానున్న తరుణంలో గుంటూరు జిల్లా విద్యార్థుల్లో ఉత్కంఠ నెలకొంది. జిల్లాలోని 150 పరీక్షా కేంద్రాల్లో 29,459 మంది రెగ్యులర్, ప్రైవేటుగా మరో 961 మంది విద్యార్థులు తమ భవిష్యత్తు ఆశలతో పరీక్షలు రాశారు. ఇప్పుడు ఫలితాల వేళ… ఒక్కో సెకనూ గంటలా మారింది. ప్రతి ఒక్కరికీ తమ ఫలితం మీద ఎన్నో ఆశలు.. ఎన్నో లక్ష్యాలు.. పెట్టుకుని ఉన్నారు. రిజల్ట్స్ కోసం Way2News ఫాలో అవ్వండి.