News October 28, 2025

గుంటూరు: 92 కేంద్రాలకు 6 వేల మంది తరలింపు

image

మొంథా తుపాను నేపథ్యంలో జిల్లాలో సహాయక చర్యలు ముమ్మరం చేశారు. జిల్లా వ్యాప్తంగా 92 పునరావాస కేంద్రాలకు వరద ప్రభావిత ప్రాంతాల నుంచి దాదాపు 6 వేల మంది నిర్వాసితులను తరలించారు. కేంద్రాల్లో వారికి తాగునీరు, ఆహారం, చిన్న పిల్లలకు పాలు, బిస్కెట్లు అందిస్తున్నారు. కలెక్టర్‌ తమీమ్‌ అన్సారియా నేతృత్వంలో యంత్రాంగం సేవలు అందిస్తోంది.

Similar News

News October 28, 2025

GNT: జిల్లా ప్రజలకు ముఖ్య సూచన.. అత్యవసరమైతేనే

image

మొంథా తుఫాన్‌ ప్రభావంతో రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో రోడ్డు ప్రయాణాలపై పరిమితులు విధిస్తూ ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ కీలక సూచనలు జారీ చేసింది. రాత్రి 7 గంటల తర్వాత జాతీయ రహదారులపై భారీ వాహనాలు నడపకూడదని, ముందుగానే సురక్షిత లే బే ప్రాంతాల్లో నిలిపి వేయాలని తెలిపింది. ప్రజలు అత్యవసర పరిస్థితులు తప్ప ప్రయాణాలు చేయవద్దని, ప్రతి ఒక్కరూ సూచనలు తప్పక పాటించాలని విజ్ఞప్తి చేసింది.

News October 28, 2025

అవసరమైతే సహాయ చర్యలు చేపట్టండి: లోకేశ్

image

మొంథా తుఫాను తీవ్రతను సచివాలయంలోని ఆర్టీజీఎస్‌ కేంద్రం నుంచి మంత్రి నారా లోకేశ్ మంగళవారం సమీక్షించారు. హోంమంత్రి వంగలపూడి అనిత, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. తుఫాను పరిస్థితులను నిరంతరం అంచనా వేయాలని, ఎలాంటి అత్యవసర పరిస్థితులకైనా సిద్ధంగా ఉండాలని అధికారులను మంత్రి ఆదేశించారు. కూటమినేతలు, కార్యకర్తలు ప్రజలకు అవసరమైన సహాయ చర్యలు చేపట్టాలని కోరారు.

News October 28, 2025

గుంటూరు జిల్లాలో ప్రారంభమైన ముంతా తుపాన్ ఎఫెక్ట్

image

గుంటూరు జిల్లాలో మొంథా తుపాన్ ప్రభావం ప్రారంభమైంది. తెనాలి, గుంటూరు, మంగళగిరి, కొల్లిపర మండలాల్లో గాలివానలు ముప్పు రేపుతున్నాయి. భారీ గాలి వేగంతో చెట్లు ఊగిపోతుండగా, కొన్ని చోట్ల గాలితో కూడిన వర్షం పడుతుంది. అధికారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. ప్రజలు బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు పాటించాలని సూచనలు జారీ అయ్యాయి.