News March 3, 2025
గుండుగొలను: రోడ్డు ప్రమాదం.. బాలుడు మృతి

బాపులపాడు మండలంలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పోలీసుల వివరాల మేరకు.. ఏలూరు జిల్లా గుండుగొలనుకి చెందిన నాగరాజు కుటుంబం బైక్పై గుడివాడ వెళ్తుండగా ఆరుగొలను వద్ద ఆర్టీసీ బస్సు ఢీకొంది. దీంతో తీవ్ర గాయాలతో ఉన్న క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రికి తీసుకెళ్లే క్రమంలో బాలుడు మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News September 16, 2025
మల్దకల్: భర్తపై వేడి నూనె పోసిన భార్య

భార్యాభర్తల మధ్య మనస్పర్థలు తీవ్రస్థాయికి చేరుకోవడంతో భర్తపై భార్య కాగుతున్న వేడి నూనె పోసింది. ఈ ఘటన గద్వాల(D) మల్దకల్ (M) మల్లెందొడ్డిలో ఆలస్యంగా వెలుగు చూసింది. వెంకటేశ్ అతడి భార్య పద్మ ఈనెల 11న గొడవపడ్డారు. దీంతో ఆగ్రహించిన భార్య అతడిపై వేడి నూనె పోసింది. వెంకటేశ్ను చికిత్స నిమిత్తం కర్నూల్ తరలించగా సోమవారం మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
News September 16, 2025
HYD: 24 గంటలు గడిచినా కనిపించనిజాడ

భారీ వర్షానికి వరద పోటెత్తడంతో ఆదివారం రాత్రి నాలాలో గల్లంతైన మాన్గార్ బస్తీకి చెందిన అర్జున్, రామా జాడ ఇప్పటివరకు లభించలేదు. ఆదివారం రాత్రి నుంచి DRF, GHMC రెస్క్యూ టీమ్లు తీవ్రంగా గాలిస్తున్నాయి. మూసీ నదిలోనూ ముమ్మరంగా గాలింపు ప్రక్రియ కొనసాగుతోంది. వారిద్దరు నాలాలో కొట్టుకొని పోవడంతో అఫ్జల్ సాగర్ ప్రాంతంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
News September 16, 2025
HYDలో రహదారులు గోదారులవుతోంది ఇందుకే!

HYDలో రహదారులు గోదారులు కావడానికి జనాభాకు అవసరమైన స్థాయిలో డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడం, చెరువులు, నాలాలు కబ్జా కావడం ప్రధాన కారణాలు. వీటన్నింటితో పాటు అందుబాటులో ఉన్న వనరుల్ని వినియోగించకపోవడంతో వరద ముంపునకు కారణమవుతున్నట్లు హైడ్రా గుర్తించింది. ఇటీవల మైత్రివనం చౌరస్తా వద్ద చేపట్టిన వరద తరలింపు చర్యలు ఫలితాలు ఇవ్వడంతో నగరంలో మరో 40 ప్రాంతాల్లో అమలు చేస్తున్నట్లు కమిషనర్ రంగనాథ్ తెలిపారు.