News February 24, 2025
గుండెపోటుతో ప్రభత్వ ఉపాధ్యాయుడు మృతి

గుండెపోటుతో ప్రభత్వ ఉపాధ్యాయుడు మృతి చెందిన ఘటన టేకులపల్లి మండలంలో జరిగింది. బోడు గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లు(60) ఆదివారం ఓ శుభకార్యానికి వెళ్లేందుకు బయలుదేరుతుండగా గుండెపోటు రావడంతో కింద పడిపోయారు. కుటుంబ సభ్యులు కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. వెంకటేశ్వర్లు(60) టేకులపల్లి మం. ఎర్రాయిగూడెం ప్రాథమిక పాఠశాలలో హెచ్ఎంగా పనిచేస్తున్నారు.
Similar News
News February 24, 2025
విశాఖ: 25 ఏళ్ల తర్వాత కలుసుకున్నారు..❤

విశాఖ జిల్లా ఆనందపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సిల్వర్ జూబ్లీ ఆత్మీయ సమావేశం ఆదివారం జరిగింది. 1998-99లో 10వ తరగతి చదివిన విద్యార్థులు 25 ఏళ్ల తర్వాత కలుసుకున్నారు. వారి పాత జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. ఆటపాటలతో సరదాగా గడిపారు. చదువులు చెప్పిన టీచర్లకు సన్మానం చేశారు. మీరూ ఇలా చేశారా? చివరిసారి ఎప్పుడు గెట్ టూ గెదర్ చేసుకున్నారో కామెంట్ చేయండి.
News February 24, 2025
తిరుమల శ్రీవారి టికెట్లు విడుదల

AP: తిరుమల శ్రీవారి మే నెల కోటా ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల(రూ.300)ను టీటీడీ విడుదల చేసింది. అలాగే, మధ్యాహ్నం 3 నుంచి తిరుమల, తిరుపతిలో గదుల కోటా టికెట్లు ఆన్లైన్లో అందుబాటులో ఉండనున్నాయి. శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శన టికెట్లను అధికారిక సైట్లోనే బుక్ చేసుకోవాలని <
News February 24, 2025
మద్దూరు: అదృశ్యమై.. శవమై కనిపించాడు

మద్దూరు మండలంలో ఓ గుర్తు <<15554760>>తెలియని <<>>వ్యక్తి ఉరేసుకుని మృతిచెందిన విషయం తెలిసిందే. ఎస్ఐ విజయ్కుమార్ వివరాలు.. రెనివట్ట గ్రామానికి చెందిన రాములు(50) గత నెల 20న ఇంటి నుంచి వెళ్లాడు. తిరిగి రాకపోవడంతో ఆయన భార్య 22న పోలీసులకు ఫిర్యాదు చేసింది. కాగా, ఆదివారం ఆయన చెట్టుకు ఉరేసుకుని కనిపించాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని రాములుగా గుర్తించారు.