News April 12, 2025

గుండెపోటుతో మొగుళ్లపల్లి ఎంపీడీఓ మృతి

image

ఎంపీడీఓగా విధులు నిర్వర్తిస్తున్న మహబూబ్ హుస్సేన్ గుండెపోటుతో మృతి చెందారు. పదిహేనేళ్లుగా జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహించి ఇటీవల ఎంపీడీఓగా బాధ్యతలు తీసుకున్నారు. మేలో పదవీ విరమణ ఉండగా ఇలా జరగడం చాలా బాధాకరమని ప్రజా ప్రతినిధులు, ఉద్యోగులు విచారం వ్యక్తం చేశారు.

Similar News

News November 5, 2025

ఎస్‌బీఐ క్లర్క్ ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల

image

క్లర్క్ పోస్టుల భర్తీకి నిర్వహించిన ప్రిలిమినరీ ఎగ్జామ్ ఫలితాలను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిలీజ్ చేసింది. మెయిన్స్‌కు ఎంపికైన వారి వివరాల పీడీఎఫ్‌ను వెబ్‌సైట్‌లో ఉంచినట్లు తెలిపింది. 6,589 జూనియర్ అసోసియేట్స్ పోస్టులకు సెప్టెంబర్ 20, 21, 27 తేదీల్లో పరీక్షలు నిర్వహించింది. ఫలితాల కోసం ఇక్కడ <>క్లిక్<<>> చేయండి.

News November 5, 2025

గూడెం: ఆలయంలో కార్తీక పౌర్ణమికి ఏర్పాట్లు పూర్తి

image

దండేపల్లి మండలంలోని పవిత్ర గోదావరి నది ఒడ్డున ఉన్న శ్రీ సత్యనారాయణ స్వామి ఆలయంలో కార్తీక పౌర్ణమి వేడుకల కోసం ఏర్పాట్లు పూర్తి చేశామని ఆలయ కమిటీ సభ్యులు, పూజారులు మంగళవారం సాయంత్రం తెలిపారు. మంచిర్యాల జిల్లా నుంచే కాకుండా కరీంనగర్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్ జిల్లాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున వచ్చే అవకాశం ఉన్నందున అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. రేపు అన్నదాన కార్యక్రమం ఉంటుందన్నారు.

News November 4, 2025

యాదాద్రి: కార్తీక పౌర్ణమి వ్రతాలకు ప్రత్యేక ఏర్పాట్లు

image

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానంలో కార్తీక మాస శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలు వైభవంగా కొనసాగుతున్నాయి. అందులో బుధవారం కార్తీక పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భక్తుల సౌకర్యార్థం రేపు ఒక్కరోజు ఎనిమిది బ్యాచులుగా వ్రతాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఈ అవకాశాన్ని భక్తులు వినియోగించుకోవాలని కోరారు.