News April 12, 2025

గుండెపోటుతో మొగుళ్లపల్లి ఎంపీడీఓ మృతి

image

ఎంపీడీఓగా విధులు నిర్వర్తిస్తున్న మహబూబ్ హుస్సేన్ గుండెపోటుతో మృతి చెందారు. పదిహేనేళ్లుగా జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహించి ఇటీవల ఎంపీడీఓగా బాధ్యతలు తీసుకున్నారు. మేలో పదవీ విరమణ ఉండగా ఇలా జరగడం చాలా బాధాకరమని ప్రజా ప్రతినిధులు, ఉద్యోగులు విచారం వ్యక్తం చేశారు.

Similar News

News April 19, 2025

MNCL: పోలీసులను ఇబ్బంది పెట్టిన ముగ్గురి అరెస్ట్

image

పోలీసుల విధులకు ఆటంకం కలిగించిన ముగ్గురిపై శుక్రవారం కేసు నమోదు చేసినట్లు ఎస్సై కిరణ్ కుమార్ తెలిపారు. శుక్రవారం రాత్రి డ్యూటీలో ఉన్న బ్లూకోల్ట్ కానిస్టేబుల్ సత్యనారాయణ, హోంగార్డు రవి ఓ లాడ్జి ఎదుట బైక్‌పై ముగ్గురు వ్యక్తులు కూర్చొని న్యూసెన్స్ చేస్తుండగా వెళ్లి అడిగారు. డ్యూటీలో ఉన్నారని తెలిసి పోలీసులను తిట్టిన బానోత్ సాయి వికాస్, సిలారపు వినయ్‌, ఓ మైనర్‌పై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.

News April 19, 2025

ఇది నమ్మశక్యంగా లేదు: రోహిత్ శర్మ

image

వాంఖడే స్టేడియంలో స్టాండ్‌కు తన పేరును పెట్టడంపై రోహిత్ శర్మ భావోద్వేగానికి గురయ్యారు. ‘నా ఫేవరెట్ రంజీ ప్లేయర్లను చూసేందుకు వాంఖడే బయట ఎదురుచూస్తూ ఉండేవాడిని. స్టేడియంలోకి అందర్నీ రానిచ్చేవారు కాదు. అలాంటిది అదే స్టేడియంలో నా పేరిట స్టాండ్ అంటే చాలా భావోద్వేగంగా ఉంది. నమ్మశక్యంగా లేదు. ఇది ఎంతోమంది క్రికెటర్లకు కల’ అని హర్షం వ్యక్తం చేశారు.

News April 19, 2025

వ్యవసాయంలో నూతన సాంకేతికతను అలవర్చుకోవాలి: రాజనర్సింహ

image

రైతులందరూ నూతన సాంకేతిక నలబరుచుకొని వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చుకోవాలని మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. సంగారెడ్డి జిల్లా రాయికోడ్ ఆత్మ కమిటీ ప్రమాణ స్వీకారంలో అయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. వ్యవసాయాన్ని కాంగ్రెస్ పార్టీ పండగల మార్చిందన్నారు. రాయికోడ్ ప్రాంతానికి లిఫ్టు ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు.

error: Content is protected !!