News February 25, 2026
గుంతకల్లు డివిజన్లో ఖాళీల భర్తీకి కసరత్తు

సౌత్ సెంట్రల్ రైల్వే గుంతకల్లు డివిజన్లో పాయింట్స్ మెన్ ఖాళీల భర్తీ కోసం 16 మంది మాజీ సైనికులను కాంట్రాక్ట్ పద్ధతిలో నియమించనున్నట్లు రైల్వే శాఖ అధికారులు తెలిపారు. ఎంపికైన వారికి రూ.18,000 వేతనం, ఇతర భత్యాలు చెల్లిస్తామని చెప్పారు. మాజీ సైనికులు మార్చి 6వ తేదీ లోపు దరఖాస్తులను గుంతకల్లు డివిజన్ కార్యాలయంలో సమర్పించాలని సూచించారు. మరిన్ని వివరాల కోసం 08554 241146 సంప్రదించాలని కోరారు.
Similar News
News March 2, 2026
TODAY TOP NEWS

* ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ హతం
* ఖమేనీ హత్యకు నిరసనగా HYD, BLR, ఢిల్లీలో నిరసనలు
* విశ్వసనీయతతోనే మధ్యవర్తిత్వం సఫలం: CJI
* కేసులు పరిష్కరించే మధ్యవర్తులకు రూ.10,000: CBN
* 2029లో జగన్ సీఎం కావడం తథ్యం: కొడాలి నాని
* GST వసూళ్లలో ఏపీ, తెలంగాణ దూకుడు
* సీఎం రేవంత్కు ధన్యవాదాలు: రాజగోపాల్ రెడ్డి
* T20WC సెమీస్కు దూసుకెళ్లిన భారత్
* ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం: 10% పెరిగిన క్రూడ్ ఆయిల్ ధర
News March 2, 2026
HYDలో హాకీ వరల్డ్కప్ క్వాలిఫయర్ మ్యాచులు

TG: హైదరాబాద్ గచ్చిబౌలి హాకీ స్టేడియంలో ఈ నెల 8 నుంచి 14 వరకు ఉమెన్స్ హాకీ వరల్డ్కప్ క్వాలిఫయర్ మ్యాచులు జరగనున్నాయి. FIH&హాకీ ఇండియాతో కలిసి రాష్ట్ర క్రీడా శాఖ వీటిని హోస్ట్ చేయనుంది. ఇండియా, ఇంగ్లండ్, ఆస్ట్రియా, ఇటలీ, కొరియా, స్కాట్లాండ్, ఉరుగ్వే, వేల్స్ పాల్గొననున్నాయి. భారత జట్టుతో పాటు స్కాట్లాండ్, ఉరుగ్వే టీమ్లు ఇప్పటికే HYD చేరుకున్నాయి. ఈ ఇంటర్నేషనల్ టోర్నీ HYDలో జరగడం ఇదే తొలిసారి.
News March 2, 2026
నల్గొండలో పర్యటించనున్న మల్లికార్జున ఖర్గే

కాంగ్రెస్ పార్టీ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే రేపు నల్గొండలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకొని అక్కడి నుంచి 3 గంటలకు నాగార్జున సాగర్ బుద్దవనం రానున్నారని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. అనంతరం రాష్ట్ర నాయకులతో భేటీ అయి రాష్ట్రంలో ఉన్న రాజకీయ పరిస్థితులు, కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై దిశా నిర్దేశం చేయనున్నారు.


