News September 24, 2024

గుజరాత్‌లో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పర్యటన

image

సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి గుజరాత్‌లో పర్యటిస్తున్నారు. మంత్రి ఆధ్వర్యంలో రాష్ట్రానికి చెందిన హై లెవెల్ కమిటీ సభ్యులు ఈ పర్యటనలో పాల్గొన్నారు. ఆ రాష్ట్రంలో పీపీపీ విధానంలో జరుగుతున్న రోడ్ల అభివృద్ధి, ఇతర అనేక అంశాలపై ఈ కమిటీ అధ్యయనం చేస్తోంది. నిన్న ఆ రాష్ట్ర ఆర్‌అండ్‌బీ ముఖ్య కార్యదర్శి, చీఫ్‌ ఇంజినీర్లతో అహ్మదాబాద్‌లో సమావేశమై చర్చించారు.

Similar News

News September 24, 2024

కర్నూలు జిల్లాలో భారీగా MPDOల బదిలీ

image

ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా భారీగా ఎంపీడీవోలు బదిలీ అయ్యారు. ఒకేసారి 42 మంది ఎంపీడీవోలకు స్థానాలు కేటాయిస్తూ జెడ్పి సీఈవో నాసరరెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో ముగ్గురు ఎంపీడీవోలను కడప జిల్లా నుంచి జిల్లాకు కేటాయించగా, మరో ఆరుగురు ఎంపీడీవోలను అనంతపురం జిల్లా నుంచి కర్నూలు జిల్లాకు కేటాయించారు.

News September 24, 2024

బేతంచెర్లలో రోడ్డు ప్రమాదం.. ఒకరి మృతి

image

బేతంచెర్ల మండలం ముచ్చట్ల దేవాలయానికి వెళ్లే రహదారిపై మంగళవారం ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాల మేరకు.. బేతంచెర్లకు చెందిన యువకులు బైకుపై వెళ్తుండగా, ట్రాక్టర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కుంచే శ్రీనివాసులు(22) అక్కడికక్కడే మృతి చెందగా, గణేష్‌కి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుణ్ని కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

News September 24, 2024

సీడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా సుబ్బారెడ్డి

image

డోన్ నియోజకరవర్గ టీడీపీ ఇన్‌ఛార్జ్ సుబ్బారెడ్డికి కీలక నామినేటెడ్ పదవి వరించింది. సీడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా ప్రభుత్వం ఆయనను నియమించింది. ఎన్నికల ముంగిట సీనియర్ నేత కోట్ల జయసూర్యప్రకాశ్ రెడ్డి కోసం ఎమ్మెల్యే సీటును త్యాగం చేయడం, వైసీపీ ప్రభుత్వ హయాంలో పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌గా కీలక బాధ్యతలు నిర్వర్తించి కార్యకర్తలకు అండగా ఉండటంతో ఆయనకు టీడీపీ ప్రభుత్వం కీలక పదవి కట్టబెట్టింది.