News March 23, 2024
గుడివాడ: గుంతలో పడి వ్యక్తి మృతి
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_32024/1711175085349-normal-WIFI.webp)
గుడివాడలో పామర్రు- కత్తిపూడి జాతీయ రహదారిలో రోడ్డు విస్తరణ పనులు జరుగుతున్నాయి. ఈ క్రమంలో రహదారి గుంతలో పడి టెంట్ హౌస్ కూలి కాటూరి స్వామి(54)అనే వ్యక్తి మృతిచెందాడు. కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో నిండు ప్రాణం బలి అయిందని, రోడ్డుపై హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయకపోవడంతోనే ప్రమాదం జరిగిందని స్థానికులు అంటున్నారు. జీవనాధారం కోల్పోయిన తమను ఆదుకోవాలని మృతుని కుటుంబ సభ్యులు ఆందోళన చేస్తున్నారు.
Similar News
News July 3, 2024
విజయవాడ: ఆదాయపు పన్ను చెల్లించడం మన కర్తవ్యం
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1719972934740-normal-WIFI.webp)
ఆదాయపు పన్ను చెల్లించడం మన కర్తవ్యమని ప్రతి ఒక్కరూ పన్నులు చెల్లిస్తూ దేశాభివృద్ధికి తోడ్పడాలని డీఆర్ఎం నరేంద్ర, ఆనందరావు, పాటిల్ కోరారు. దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్, ఆదాయపు పన్ను శాఖల సంయుక్త ఆధ్వర్యంలో మంగళవారం రైల్వే ఆడిటోరియంలో ఆదాయపు పన్ను రిటర్న్స్ ఫైలింగ్ నిర్వహించిన అవగాహన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు. దేశ ఆర్థికాభివృద్ధిలో ఆదాయ సేకరణ కీలకమని చెప్పారు.
News July 3, 2024
మైలవరం: పింఛన్ల పంపిణీలో VRO చేతివాటం
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1719972109403-normal-WIFI.webp)
పింఛన్ల పంపిణీలో VRO చేతివాటం చూపిన ఘటన మైలవరంలో చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. మైలవరంలోని 5వ సచివాలయ పరిధిలో VROగా పనిచేస్తున్న తరుణ్ సోమవారం 43 మందికి పింఛన్లు పంచాడు. అనంతరం మరో 7మంది లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి ఐరిస్ తీసుకుని సంతకం చేయించుకుని సర్వర్ పనిచేయలేదని తెలిపాడు. చివరికీ రూ.48వేల డబ్బును సొంతానికి వాడుకున్నాడు. విషయం తెలుసుకున్న MPDO, తహశీల్దార్ చర్యలు తీసుకుంటామన్నారు.
News July 3, 2024
విజయవాడ: దేవదాయశాఖ అధికారిణి సస్పెండ్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1719949593527-normal-WIFI.webp)
ఉమ్మడి కృష్ణా జిల్లా దేవదాయశాఖ అధికారిణి కె శాంతిని సస్పెండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం దేవదాయశాఖ కమిషనర్ సత్యనారాయణ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా ఉమ్మడి కృష్ణా జిల్లా దేవదాయశాఖ అధికారిణినిగా ఉన్న ఈమెను బాధ్యతల నుంచి తొలగించగా, తాజాగా ఆమెను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా కృష్ణా జిల్లాకు సంధ్యా, ఎన్టీఆర్ జిల్లాకు సీతారావమ్మలను సహాయ కమిషనర్లుగా నియమించారు.