News February 4, 2025
గుడివాడ: లారీ ఢీకొని వ్యక్తి గుర్తుతెలియని మృతి

గుడివాడ మార్కెట్ సెంటర్లో మంగళవారం సాయంత్రం టిప్పర్ ఢీకొని సైక్లిస్ట్ మృతి చెందాడు. ఏలూరు రోడ్లో నుంచి పామర్రు రోడ్డు వైపు వెళ్తున్న టిప్పర్ మార్కెట్ సెంటర్లోని కటారి సత్యనారాయణ చౌకు వద్ద మలుపులో సైకిల్ మీద వస్తున్న వృద్ధుడిని ఢీకొట్టింది. ఘటనలో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు అక్కడకు చేరుకుని లారీ డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
Similar News
News July 10, 2025
మచిలీపట్నం: 11న ‘వార్తాలాప్’ జర్నలిస్ట్లకు వర్క్ షాప్

ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) ఆధ్వర్యంలో ఈ నెల 11వ తేదీన మచిలీపట్నంలో జర్నలిస్టులకు ‘వార్తాలాప్’ మీడియా వర్క్ షాప్ నిర్వహించనున్నట్టు PIB డైరెక్టర్ రత్నాకర్ తెలిపారు. ఉదయం 10 గంటలకు వలందపాలెంలోని G కన్వెన్షన్లో నిర్వహించే ఈ వర్క్ షాప్కు మంత్రి కొల్లు రవీంద్ర, కలెక్టర్ బాలాజీ ముఖ్య అతిథులుగా పాల్గొంటారన్నారు. జిల్లాలోని జర్నలిస్టులు ఈ వర్క్ షాప్లో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.
News July 10, 2025
కృష్ణా: గుర్తింపు లేని పార్టీలకు ఈసీ షోకాజ్ నోటీసులు

ఆరు సంవత్సరాలుగా ఒక్క ఎన్నికలోనూ పోటీ చేయని గుర్తింపు లేని రాజకీయ పార్టీలకు భారత ఎన్నికల సంఘం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. కృష్ణాజిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డీ.కే. బాలజీ ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. చట్టబద్ధంగా నమోదై, రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనని ఈ పార్టీలపై తదుపరి చర్యలు తీసుకోనున్నట్లు కలెక్టర్ వివరించారు.
News July 10, 2025
కృష్ణా జిల్లాలో టుడే టాప్ న్యూస్

☞కృష్ణా: రేపే మెగా పేరెంట్స్, టీచర్స్ మీటింగ్
☞ గుడివాడ ఫ్లైఓవర్ పనులు వేగవంతం
☞ వీరవల్లి: మిస్సింగ్ కేసు చేధించిన పోలీసులు
☞ మచిలీపట్నం: ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం
☞ కృష్ణా: పీఏసీఎస్లకు త్రిసభ్య కమిటీలు
☞ మచిలీపట్నం: మైనర్ల తల్లిదండ్రులకు డీఎస్పీ రాజా హెచ్చరికలు
☞ కనకదుర్గమ్మ సన్నిధిలో కొనసాగుతున్న శాఖాంబరి ఉత్సవాలు