News October 24, 2025

గుడిసె లేని ఊరే ప్రజాపాలన లక్ష్యం: పరిగి ఎమ్మెల్యే

image

గుడిసె లేని ఊరిని చూడడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని పరిగి ఎమ్మెల్యే టి.రామ్మోహన్ రెడ్డి అన్నారు. పరిగి నియోజకవర్గం గండీడ్ మండలం జంగం రెడ్డిపల్లి గ్రామంలో శుక్రవారం నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ పూజలో ఆయన పాల్గొన్నారు. పేదల సొంతింటి కలను సాకారం చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పేరుతో ప్రజలను మోసం చేసిందని విమర్శించారు.

Similar News

News October 25, 2025

కడప: ఒక్కరోజే 950 మందిపై కేసు..!

image

కడప జిల్లా ఎస్పీ నచికేత్ ఆదేశాల మేరకు శుక్రవారం పోలీసులు విస్తృతంగా వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ తనిఖీలలో 219 ద్విచక్రవాహనాలు, 21 ఆటోలు, ఒక గూడ్స్ ఆటో, 950 మందిపై మోటారు వెహికల్ చట్టం ప్రకారం కేసులు నమోదు చేశారు. ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమించినందుకు గాను రూ .2,449,50 జరిమానా విధించినట్లు పోలీసులు తెలిపారు. వాహన సేఫ్టీపై ప్రత్యేక డ్రైవ్ చేపట్టినట్లు తెలిపారు.

News October 25, 2025

మెదక్: సీసీటీవీ కెమెరా ఇన్స్టాలేషన్ శిక్షణ

image

గ్రామీణ యువతకు ఉపాధి కల్పనలో భాగంగా సీసీటీవీ కెమెరా ఇన్స్టాలేషన్, సర్వీసింగ్ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు స్టేట్ బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ డైరెక్టర్ రాజేష్ కుమార్ తెలిపారు. మెదక్, సంగారెడ్డి జిల్లాలో చెందిన యువతకు 15 రోజులపాటు ఉచిత శిక్షణ, సర్టిఫికెట్ ఇవ్వనున్నట్లు వెల్లడించారు. ఆసక్తిగల అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

News October 25, 2025

KTDM: మహిళకు వేధింపులు.. ముగ్గురికి జైలు శిక్ష

image

మహిళను అసభ్య పదజాలంతో దూషించి, వేధింపులకు గురిచేసిన కేసులో నిందితులకు దమ్మపేట జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు జడ్జి భవాని శుక్రవారం జైలు శిక్ష, జరిమానా విధించారు. పెద్దగొల్లగూడెంకి చెందిన సీతారాములు, రఘురాం, వెంకటేశ్ మహిళను వేధించినట్లు నేరం రుజువు కావడంతో రెండు సంవత్సరాల ఏడు నెలల జైలు శిక్షతో పాటుగా ఒక్కొక్కరికీ రూ.1,000 జరిమానా విధించారు.