News March 3, 2025
గుడిహత్నూర్లో బాలిక సూసైడ్

గుడిహత్నూర్ మండలంలో విషాదం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. సూర్యగూడ గ్రామానికి చెందిన గెడం వేదిక(16) సోమవారం పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. గమనించిన కుటుంబీకులు వెంటనే 108లో రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. కాగా అక్కడ చికిత్స పొందుతూ మధ్యాహ్నం మృతి చెందినట్లు వెల్లడించారు.
Similar News
News November 9, 2025
మామిడిలో ఆకుతినే పురుగు నివారణకు సూచనలు

మామిడిని ఆకుతినే పురుగు ఆశించి పంటకు నష్టం కలిగిస్తుంది. దీని నివారణకు అజాడిరక్టిన్(3000 పి.పి.ఎం.) 300 మి.లీ.లతోపాటు ఎసిఫేట్ 75% ఎస్.పి. 150 గ్రా. లేదా క్వినాల్ఫాస్ 25% ఇ.సి. 200ml లేదా ప్రొఫెనోఫోస్ 50% ఇ.సి. 200ml లలో ఏదైనా ఒక దానిని 100 లీటర్ల నీటికి కలిపి చెట్టు పూర్తిగా తడిచేలా పిచికారీ చేసుకోవాలి. అలాగే మామిడి తోటలో కలుపు మొక్కలు లేకుండా శుభ్రంగా ఉండేటట్లు చూసుకోవాలి.
News November 9, 2025
విషాదం.. విద్యుదాఘాతంతో లైన్మన్ మృతి

ఖమ్మం రూరల్ మండలంలోని బారుగూడెంలో విద్యుత్ పనులు చేస్తుండగా, కైకొండాయిగూడెంకు చెందిన లైన్మన్ టీ.గోపీ (26) శనివారం విద్యుదాఘాతంతో అక్కడికక్కడే మృతి చెందాడు. లైన్ క్లియర్ తీసుకున్నా అకస్మాత్తుగా విద్యుత్ సరఫరా కావడంతోనే ఈ దుర్ఘటన జరిగినట్లు స్థానికులు తెలిపారు. సరైన భద్రతా చర్యలు తీసుకోకపోవడం వల్లే తన భర్త మరణించాడని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.
News November 9, 2025
విమాన రాకపోకలకు తీవ్ర అంతరాయం.. ముందే చెప్పామన్న ATC

ఢిల్లీ ఎయిర్పోర్టులో 2 రోజుల క్రితం తలెత్తిన తీవ్ర సాంకేతిక సమస్య గురించి తాము కొన్ని నెలల ముందే గుర్తించి చెప్పామని ATC పేర్కొంది. అహ్మదాబాద్ ప్రమాదం తర్వాత అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఎయిర్ నావిగేషన్ వ్యవస్థలను అప్గ్రేడ్ చేయాలని AAIకి లేఖ రాసినట్లు వెల్లడించింది. కానీ తమ సూచనలను పట్టించుకోలేదంది. ఢిల్లీ, ముంబై ఎయిర్పోర్టుల్లో ATC వ్యవస్థ కుప్పకూలి 800కు పైగా విమానాలపై ప్రభావం చూపింది.


