News December 18, 2025
గుమ్మానికి ఈ మూట కడితే.. లక్ష్మీదేవి అనుగ్రహం

ప్రధాన గుమ్మాన్ని ధన ద్వార నిధిగా మార్చుకున్నవారి ఇంట్లో లక్ష్మీదేవి ఉంటారని పండితులు, వాస్తు నిపుణులు సూచిస్తున్నారు. ధన ద్వార నిధి కోసం ఓ నారింజ రంగు వస్త్రం తీసుకోవాలి. అందులో లక్ష్మీదేవికి ఇష్టమైన ఉప్పు, నవధాన్యాలు, పసుపు, కుంకుమ, పచ్చ కర్పూరం వేసి మూట కట్టాలి. కోరిక కోరి దాన్ని గుమ్మానికి కట్టాలి. దీనివల్ల ఇంట్లో ఎప్పుడూ ధనానికి, ఐశ్వర్యానికి లోటు ఉండదని, సుఖసంతోషాలు లభిస్తాయని ప్రతీతి.
Similar News
News December 19, 2025
ఆసియా యూత్ పారా గేమ్స్లో సత్తా చాటిన హైదరాబాద్ బాలిక

ఆసియా యూత్ పారా గేమ్స్లో తెలుగు ప్లేయర్ గంగపట్నం విజయ దీపిక టేబుల్ టెన్నిస్లో స్వర్ణం, కాంస్యం గెలిచింది. హైదరాబాద్కు చెందిన దీపిక టీటీ మిక్స్డ్ డబుల్స్లో స్వర్ణం, మహిళల సింగిల్స్లో కాంస్యం సొంతం చేసుకుంది. 15 ఏళ్ల దీపిక కాంటినెంటల్ స్థాయిలో స్వర్ణం గెలిచిన పిన్న వయస్కురాలిగా ఘనత సాధించింది. దీపిక తల్లి అరుణ వెటరన్ టెన్నిస్ ప్లేయర్. సోదరుడు విజయ్ తేజ్ జాతీయ స్థాయి టెన్నిస్ ప్లేయర్.
News December 19, 2025
24,000 మంది పాక్ బిచ్చగాళ్లను వెనక్కి పంపిన సౌదీ

వ్యవస్థీకృత భిక్షాటనకు పాల్పడుతున్న పాకిస్థానీలపై గల్ఫ్ దేశాలు ఉక్కుపాదం మోపుతున్నాయి. భిక్షాటన చేస్తున్న దాదాపు 24,000 మందిని 2025లో సౌదీ వెనక్కి పంపగా.. దుబాయ్ 6,000, అజర్బైజాన్ 2,500 మందిని బహిష్కరించాయి. మరోవైపు పెరుగుతున్న నేరాల కారణంగా పాకిస్థానీలపై UAE వీసా ఆంక్షలు విధించింది. అక్రమ వలసలు, భిక్షాటన ముఠాలను అరికట్టేందుకు పాక్ FIA స్వదేశీ విమానాశ్రయాల్లో 66,154 మందిని అడ్డుకుంది.
News December 19, 2025
ఏది నీతి.. ఏది నేతి.. ఓ మహాత్మా.. ఓ మహర్షి!

తెలంగాణలో పార్టీ ఫిరాయింపులపై ఆరోపణలు చిత్ర విచిత్రంగా ఉన్నాయి. తమ గుర్తుపై గెలిచిన ఎమ్మెల్యేలను కాంగ్రెస్ చేర్చుకుంటే, స్పీకర్ వారికి క్లీన్ చిట్ ఇచ్చారని BRS ఆరోపిస్తోంది. అయితే గురవింద గింజ నీతులతో మీ కింద నలుపు మర్చిపోవద్దని కాంగ్రెస్ కౌంటర్ ఇస్తోంది. BRS హయాంలో ఇలాగే చేర్చుకోలేదా? మంత్రి పదవులు ఇవ్వలేదా? అనేది హస్తం నేతల ప్రశ్న. ఇక్కడ తప్పు పార్టీలదా? తెలిసీ ఇలాంటి వారిని ఎన్నుకునే ప్రజలదా?


