News September 19, 2024
గురజాడ జయంతిని ఘనంగా నిర్వహించాలి: కలెక్టర్
మహాకవి గురజాడ వెంకట అప్పారావు 162వ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డా.బి.ఆర్.అంబేద్కర్ తెలిపారు. బుధవారం కలెక్టర్ ఛాంబర్లో గురజాడ జయంతి ఉత్సవాలపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. గురజాడ గృహం వద్ద ఉదయం 9 గంటలకు జ్యోతి ప్రజ్వలన గావించి ఆయన విగ్రహానికి పూల మాలాలంకరణ చేస్తామన్నారు.
Similar News
News October 14, 2024
ఘనంగా పైడితల్లి తొలేళ్ల సంబరం
శ్రీ పైడితల్లి అమ్మవారి తొలేళ్ల సంబరం సోమవారం ఘనంగా జరిగింది. ఊరంతా పండగ శోభను సంతరించుకుంది. పులివేషాలు, కర్రసాము, కత్తిసాము, వివిధ వేషాలతో పట్టణంలో సందడి నెలకొంది. అమ్మవారికి మొక్కులు సమర్పించేందుకు భక్తులు బారులు తీరారు. ఘటాలతో, అమ్మవారి నామ స్మరణతో పట్టణం మారుమోగింది. వివిధ ప్రాంతాల నుంచి పట్టణానికి భక్తులు తరలివస్తున్నారు.
News October 14, 2024
నేడు పైడితల్లి అమ్మవారి తోలేళ్ల ఉత్సవం
భక్తుల కోర్కెలు తీర్చే పైడితల్లి అమ్మవారి తోలేళ్ల ఉత్సవానికి సర్వం సిద్ధమైంది. నేటి నుంచి మొదలయ్యే పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం జాతర అక్టోబర్ 29న ఉయ్యాల కంబాల ఉత్సవంతో ముగుస్తుంది. రేపు సిరిమానోత్సవం జరగనుండగా 2 వేల మందితో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. మరోవైపు పైడితల్లి జాతర నేపథ్యంలో నేడు, రేపు విజయనగరంలో మద్యం దుకాణాలు, బార్లు మూసివేయనున్నట్లు సీఐ మన్మథరావు తెలిపారు.
News October 14, 2024
VZM: డ్రాలో ఎంపికయ్యే వారికి కీలక సూచనలు
మద్యం షాపులకు కలెక్టరేట్లో సోమవారం లాటరీ ప్రక్రియ జరగనున్న సంగతి తెలిసిందే. లాటరీలో ఎంపికయ్యే వారికి అబ్కారీ శాఖ సూపరిండెంటెండ్ శ్రీనాధుడు కీలక సూచనలు చేశారు. ఒక్కో షాపుకు ఒక్కో అభ్యర్థిని ఎంపిక చేస్తామని, వారితో పాటు మరో ఇద్దరు రిజర్వుడు అభ్యర్థులను కూడా ఎంపిక చేస్తామన్నారు. అసలు వ్యక్తి 24 గంటల్లోగా 6వ వంతు లైసెన్స్ ఫీ చెల్లించాల్సి ఉందని, లేకపోతే రిజర్వు అభ్యర్థులకు షాపులు కేటాయిస్తామన్నారు.