News March 22, 2024

‘గురుకులాల్లో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం’

image

మహబూబ్ నగర్: తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో మిగులు సీట్ల భర్తీకి ఈనెల 23 తుది గడువు అని జిల్లా ప్రాంతీయ సమన్వయ అధికారిణి ఫ్లారెన్స్ రాణి తెలిపారు. 2024-25 విద్యా సంవత్సరానికి 6,7,8,9 తరగతుల్లో మిగులు సీట్లు ఉన్నాయని, ఆసక్తి గల విద్యార్థులు దరఖాస్తులు చేసుకోవాలని, వెంటనే నిర్దేశిత వెబ్ సైట్ www.tswreis.ac.in లో వివరాలు నమోదు చేసుకోవాలని సూచించారు.

Similar News

News October 22, 2025

మయూర వాహనంపై ఊరేగిన కురుమూర్తి రాయుడు

image

కురుమూర్తిస్వామి వారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. అయితే బుధవారం స్వామిని పల్లకి సేవలో మయూర వాహనంపై భక్తులు ఊరేగించారు. స్వామి వారి ఆలయం నుంచి మెట్ల దారిలో భక్తులు గోవిందా, గోవిందా అంటూ భక్తితో గోవింద నామస్మరణలతో స్వామి వారిని ఊరేగించి తరించారు. ఆలయ ఛైర్మన్ గౌని గోవర్ధన్ రెడ్డి, కార్యనిర్వహణ అధికారి సి.మదనేశ్వర్ రెడ్డి, ధర్మకర్తల మండలి సభ్యులు, పలువురు పాల్గొన్నారు.

News October 22, 2025

నవాబు పేట్: కరెంట్ షాక్‌తో డ్రైవర్ మృతి

image

మండలంలోని యన్మన్‌గండ్లకు చెందిన జగదీశ్ (28) బుధవారం విద్యుత్ షాక్‌తో మృతి చెందాడు. ఓ రైతు పొలంలోకి నర్సరీ చెట్లను తీసుకెళ్తుండగా కంచెలోని విద్యుత్ వైర్లను తప్పించే క్రమంలో ప్రమాదవశాత్తూ షాక్ తగిలి అక్కడికక్కడే మరణించాడు. మృతుడితో ఉన్న నలుగురు స్వల్పంగా గాయపడ్డారు. జగదీశ్ బులెరో నడుపుతూ జీవనం సాగించేవాడు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని జిల్లా ఆసుపత్రికి తరలించారు. భార్య, ఇద్దరు పిల్లలున్నారు.

News October 22, 2025

కన్నుల పండువగా కురుమూర్తి స్వామి కళ్యాణ మహోత్సవం

image

శ్రీ కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా బుధవారం స్వామివారి కళ్యాణ మహోత్సవ కార్యక్రమం ఎంతో కమనీయంగా జరిగింది. వేద పండితులు, అర్చకుల మంత్రోచ్ఛారణ మధ్య స్వామి వారి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు. కురుమూర్తి స్వామి గిరులు “కురుమూర్తి వాసా గోవింద” నామ స్మరణతో మార్మోగాయి.