News June 27, 2024
గురుకులాల్లో మిగిలిన సీట్లకు దరఖాస్తు చేసుకోండి: శ్రీదేవి
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_62024/1719445014006-normal-WIFI.webp)
ఉమ్మడి కర్నూలు జిల్లాలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకులాల్లో 6, 7, 8, 9వ తరగతిలో మిగిలిపోయిన సీట్లను భర్తీ చేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు APSWREIS కో-ఆర్డినేటర్ ఐ.శ్రీదేవి తెలిపారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు దరఖాస్తులను ఆయా పాఠశాలల్లో పొంది ఈ నెల 28వ తేదీ లోగా అదే పాఠశాలల్లో అందజేయాలన్నారు. రాత పరీక్ష ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుందని తెలిపారు.
Similar News
News July 1, 2024
ఆదోని: రైల్వే పోలీసులు చేతివాటం
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1719804657237-normal-WIFI.webp)
అక్రమ కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయాల్సిన ఓ పోలీసు అధికారి అక్రమార్జనకు తెరలేపిన ఘటన ఆదోని రైల్వే డివిజన్ పరిధిలోని ఓ స్టేషన్లో ఆదివారం వెలుగుచూసింది. రూ.కోటి విలువైన బంగారాన్ని అక్రమ రవాణా చేస్తున్న ఓ వ్యాపారిని అదుపులో తీసుకున్న పోలీసు అధికారి.. పైఅధికారుల సహకారంతో పైరవీలు చేసి రూ.6లక్షలకు ఒప్పందం కుదుర్చుకొని వదిలేసిన్నట్లు సోమవారం సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
News July 1, 2024
బనగానపల్లె: పింఛన్ పంపిణీ కార్యక్రమంలో మంత్రి
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1719803206766-normal-WIFI.webp)
బనగానపల్లె పట్టణంలోని తెలుగుపేటలోని ఇంటింటికీ సచివాలయ సిబ్బందితో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో రోడ్ల భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ఎన్నికల వేళ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ ప్రకారం పెంచిన పెన్షన్ రూ.4000 అలాగే 3 నెలల పెంపు రూ.3000 కలిపి ఒకేసారి రూ.7000 పింఛన్ లబ్ధిదారులకు బి.సి.జనార్దన్ రెడ్డి పంపిణీ చేశారు.
News July 1, 2024
ఆదోని: ఉరేసుకుని యువకుడి ఆత్మహత్య
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1719796183301-normal-WIFI.webp)
కర్నూలు జిల్లా ఆదోని మండలం సంతకుడ్లూరులో శనివారం రాత్రి ఇంట్లో ఫ్యాన్కు ఉరేసుకున్న బసవరాజు(22)అనే యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఉదయం నిద్ర లేచి పక్క గదిలో ఫ్యాన్కు వేలాడుతున్న భర్తను చూసిన భార్య కవిత వెంటనే ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులకు తెలిపింది. 2 నెలల క్రితమే హత్రి బెలగల్ గ్రామానికి చెందిన కవితకు బసవరాజుకు వివాహమైంది. వివాహమైన రెండు నెలలకే ఇలా జరగడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి