News December 11, 2025
గురువారం బృహస్పతిని పూజిస్తే..

మహావిష్ణువుతో పాటు బృహస్పతిని కూడా గురువారం ఆరాధించడం వల్ల కుటుంబంలో శాంతి, సిరిసంపదలు, సంతోషం కలుగుతాయని జ్యోతిష నిపుణులు సూచిస్తున్నారు. దత్తాత్రేయుడిని కూడా పూజించవచ్చని అంటున్నారు. ఈ వారానికి అధిపతి అయిన బృహస్పతిని ప్రసన్నం చేసుకోవడానికి అరటి బోదెలో దీపం వెలిగించడం, పసుపు దుస్తులు ధరించడం, అదే రంగు పూలు సమర్పించడం శుభప్రదం. నెయ్యి, బెల్లంతో నైవేద్యం పెట్టాలి’ అని చెబుతున్నారు.
Similar News
News December 11, 2025
14,967 ప్రభుత్వ ఉద్యోగాలు.. దరఖాస్తుకు ఇవాళే లాస్ట్

జవహర్ నవోదయ, కేంద్రీయ విద్యాలయాల్లో 14,967 ఉద్యోగాలకు దరఖాస్తు గడువు నేటితో ముగియనుంది. 13,025 టీచింగ్, 1,942 నాన్ టీచింగ్ పోస్టులున్నాయి. పోస్టును బట్టి PG, డిగ్రీ, B.Ed, M.Ed, MCA, M.PEd, CTET, ఇంటర్, డిప్లొమా పాసైనవారు అర్హులు. CBT, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. ఓసారి గడువు పొడిగించినందున మరోసారి అవకాశం ఉండకపోవచ్చు.
వెబ్సైట్: https://examinationservices.nic.in/
News December 11, 2025
చలికాలం.. పశువులు, కోళ్ల పెంపకంలో జాగ్రత్తలు

తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత పెరిగింది. ఈ సమయంలో కోళ్లు, పాడి పశువులకు శ్వాస సంబంధిత వ్యాధుల ముప్పు ఎక్కువ. అందుకే కోళ్లు, పశువుల ప్రవర్తనను గమనించాలి. పోషకాలతో కూడిన మేత, దాణా, మంచి నీటిని వాటికి అందించాలి. అవసరమైన టీకాలు వేయించాలి. పశువుల కొట్టాలు, కోళ్ల ఫారమ్ చుట్టూ పరదాలు కట్టాలి. ఈ సమయంలో పాడి, కోళ్ల పెంపకంలో తీసుకోవాల్సిన మరిన్ని జాగ్రత్తల గురించి తెలుసుకోవడానికి <<-se_10015>>పాడిపంట<<>> క్లిక్ చేయండి.
News December 11, 2025
BREAKING: పోలింగ్ ప్రారంభం

TG: రాష్ట్రంలో తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. 37,562 కేంద్రాల్లో 56.19 లక్షల మంది ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 3,834 సర్పంచ్ స్థానాల్లో 12,960 మంది, 27,628 వార్డుల్లో 65,455 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని ఓటర్లు తేల్చనున్నారు. మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ కొనసాగనుంది. 2PM నుంచి ఓట్లు లెక్కించి విజేతలను ప్రకటిస్తారు. ఇవాళే ఉప సర్పంచ్ ఎన్నిక కూడా ఉంటుంది.


